తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇంటస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ‘పునాధిరాళ్లు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు వెళ్లారు. పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరు ఈ సంవత్సరం వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చారు. దాదాపు తొమ్మదేళ్ల తర్వాత తమ అభిమాన నటుడు తమ కళ్లముందు రావడంతో అభిమానులు చిరు నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తోంది. దాని పరంపర కొనసాగుతూనే ఉంది. చిరు 150వ సినిమా రికార్డుల వేట ఇంకా పూర్తవ్వనేలేదు. తన తదుపరి అంటే 151వ సినిమాకు సంబంధించిన పనులు చక..చకా జరిగిపోతూనే ఉన్నాయి. భారీ అంచనాల మద్య వచ్చిన చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ షేక్ చేస్తున్న నేపథ్యంలో తన తదుపరి చిత్రం కూడా అదే రేంజ్ లో ఉండాలని చూస్తున్నారు. రీసెంట్ గా రాంచరణ్ కి ‘ధృవ’ చిత్రంతో సూపర్ హిట్ అందించిన సురేందర్ రెడ్డి ని చిరు తదుపరి చిత్రానికి దర్శకుడిగా తీసుకోబోతున్నారి ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇప్పటికే కిక్, రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ అందించిన సూరేందర్ ఈ మద్య ధృవ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు. చిరంజీవి కోసం ఓ పక్కా స్క్కిప్ట్ను తయారుచేసే పనిలో పడ్డాడట. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా పూర్తి ఎంటర్టైన్మెంట్తో సాగే కథ కోసం చూస్తున్నాడని టాక్.చిరు 151వ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్చరణే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. కథ ఫైనల్ అవగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట రామ్చరణ్.