తెలుగు ఇండస్ట్రీలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.  ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ఎన్నో అంచనాలు పెంచింది..ఇదే అంచనాలతో ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తో ప్రభంజనం సృష్టించింది.  తొమ్మిదేళ్ల తర్వాత కూడా చిరంజీవి పదేళ్లక్రితం ఎలా ఉన్నారో అదే స్టామినా అదే లుక్స్ తో అదరగొట్టారు.  ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతుంది.  ‘ఖైదీ నెంబర్ 150’ వీకెండ్ కలెక్షన్ల వంద కోట్లు దాటాయి. ఇక అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ సంబరపడిపోతున్నారు.  
Image result for khaidi no 150
ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు చిరు నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.   తాజాగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని సతీసమేతంగా చూసారు . 9 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో గవర్నర్ దంపతులు కూడా ఆసక్తిగా ఆ చిత్రాన్ని తిలకించారు .
Image result for khaidi no 150
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రాన్ని చూడగా గవర్నర్ దంపతులతో పాటు చిరు కుటుంబం కూడా మరోసారి ఈ చిత్రాన్ని వీక్షించారు . ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చూసిన గవర్నర్ నరసింహన్ చిరంజీవి నటన గురించి తెగ పొగిడేస్తున్నారు. ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ తో పాటు రైతు సమస్యల పై పోరాటాన్ని కూడా చాలా అద్భుతంగా చూపించారు. చరణ్ నిర్మించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం రికార్డులను బద్దలు కొడుతూ తెలుగు టాప్ గ్రాసర్ లలో ఒకటిగా నిలబడుతుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: