ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాహీరోల హవా ఎక్కువుగానే ఉందని చెప్పవచ్చు. మొన్నటి వరకూ మెగాస్టార్ మినహాయించి అందరు మెగాహీరోలు వరుస సినిమాలు చేస్తుంటే...ఇప్పుడు మెగాస్టార్ రావటంతో ఇతర మెగాహీరోలకి సైతం మరికాస్త డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చిన అందరి మెగాహీరోలలో ఒక్క అల్లుఅర్జున్ తమ్ముడు అల్లుశిరీష్ మాత్రం కాస్త స్లోగా ఉన్నారని అంటున్నారు.
ఇప్పటి వరకూ తన కెరీర్ లో డీసెంట్ హిట్ గా గౌరవం మూవీ ఉన్నప్పటికీ...తరువాత వచ్చిన కొత్త జంట, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాలు మంచి కమర్షియల్ హిట్స్ ని ఇచ్చాయి. అయితే ఈ చిత్రాలు మంచి బ్రేక్ ని మాత్రం ఇవ్వలేకపోయాయి. అల్లుశిరీష్ అంటే ఇది అని చెప్పుకునే చిత్రం ఇప్పటి వరకూ తనకు రాకపోవటం అనేది తన మార్కెట్ ని పెంచలేకపోతుంది. దీంతో ప్రస్తుతం అల్లుశిరీష్ కి అందరూ కాస్త కథల విషయంలో జాగ్రత్త ఉండాలంటూ సలహాలు ఇస్తున్నారంట.
సరైన బ్రేక్ ఒక్కటి వచ్చిందంటే అల్లుశిరీష్ సైతం జెట్ స్పీడ్ తో దూసుకుపోవటం ఖాయం అని అంటున్నారు. ఇప్పటి వరకూ కథల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకున్న అల్లుశిరీష్...ఇక నుండి అన్న అల్లుఅర్జున్ తోపాటు చిరంజీవి నిర్ణయాలను సైతం తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే అల్లు శిరీష్ ఒక అడుగు ముందుకేస్తూ మలయాళం చిత్రానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం మరో పెద్ద విశేషం. దర్శకుడు మేజర్ రవి తెరకెక్కిస్తున్న 1971 నాటి ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నైపథ్యం ఉన్న సినిమా ‘1971 బియాండ్ బోర్డర్స్’ ఇప్పుడు అల్లుశిరీష్ కి మంచి పేరుని తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పంజాబ్, కాశ్మీర్, రాజస్థాన్ యుగాండా వంటి ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.