‘బెంగాల్ టైగర్’ విడుదలై 14నెలలు దాటిపోతోంది. ఏడాదికి కనీసం 2 సినిమాలలో నటించే రవితేజా సినిమా లేకుండానే క్రితం ఏడాది గడిచి పోయింది. ఈ మధ్యలో రవితేజా పై వచ్చినన్ని  రూమర్స్  మరి ఏ హీరో పైనా రాలేదు. అయినా మాస్ మహారాజా చలించకుండా ఖాళీగా ఉండటం ఇష్టం లేక తన ప్రపంచ పర్యటన కొనసాగించాడు. 

ఈమధ్యలో ఎన్నో కధలు విన్న రవితేజా చిట్ట చివరకు అంధుడి పాత్రలో సెటిల్ కావడం టాపిక్ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీగా మారింది.  ఒక హీరోతో అనుకున్న కథ వేరే హీరోతో చేయటం సర్వసాధారణం ఈ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ఎన్టీఆర్ తో అనుకున్న కథతో రవితేజ సినిమా ప్రారంభమవుతోంది. ఈ చిత్రానికి  రాజా ది గ్రేట్ అనే టైటిల్ కూడా ఫైనల్  అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆశక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే ఎట్టకేలకు రవితేజ దర్శకుడు అనీల్‌ రావిపూడితో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. మరొక షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే గతంలో రవితేజాతో  విభేదాలు వచ్చి సినిమాను ఆపివేసిన  దిల్‌రాజు ఈ సినిమాను  నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెల్ల బోతున్నట్లు సమాచారం.  

దర్శకుడు అనీల్‌ రావిపూడి ఈకథను ఇంతకముందు ఎన్టీఆర్‌ తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఎన్టీఆర్‌ ఈ సినిమాలో అంధుడి పాత్రను చేయడానికి సాహసం చేయలేక  పోయాడు. అయితే అక్కడ నుంచి రకరకాల  టర్న్స్ తీసుకుని చిట్టచివరకు రవితేజ దగ్గరికి ఈకథ చేరిందని చెపుతున్నారు. ఈ మధ్యకాలంలో సరైన హిట్స్ లేక బాధ పడుతున్నాస్ రవితేజ 'పటాస్‌', 'సుప్రీమ్‌' చిత్రాల ఫేం  అనిల్‌ రావిపూడి దర్శకత్వ ప్రతిభను నమ్ముకుని ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

ఈసినిమాను వీలైనంత త్వరలో పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేయాలని దిల్ రాజ్ ప్లాన్ అని అంటున్నారు.  ఈమూవీలో రవితేజాకు జతగా రాశిఖన్నా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్‌ మెహరీన్‌ కౌర్‌ నటించనున్నారు అని టాక్. కనీసం ఈ ప్రయోగం అయినా సక్సస్ అయి తిరిగి మాస్ మహారాజా ట్రాక్ రావాలని ఆశిద్దాం..



మరింత సమాచారం తెలుసుకోండి: