రామ్ చరణ్ ఉపాసనల పెళ్ళి అయి నాలుగు సంవత్సరాలు దాటిపోవడంతో ఈమధ్య మీడియా వర్గాలు చరణ్ ను తండ్రి ఎప్పుడవుతావు ? అంటూ వరస పెట్టి ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తోంది. దీనికితోడు ఈ మధ్య రామ్ చరణ్ తన ఇంటిని రీడిజైన్ చేయిస్తున్న నేపధ్యంలో అతడి ఇంట్లోకి కొత్త మెంబర్ రాబోతున్నాడనే ప్రచారం మొదలైంది. 

అయితే ఈ వార్తలకు ఎక్కడో అక్కడ చెక్ పెట్టాలని రామ్ చరణ్ నిశ్చయించుకున్నట్లుగా కనిపిస్తోంది.  రెండు రోజుల క్రితం చిరంజీవి జీవితం పై ప్రముఖ సినిమా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన ‘మెగా చిరంజీవితం సినీ ప్రస్థానం’ పుస్తక ఆవిష్కరణ సభకు అతిధిగా వచ్చిన రామ్ చరణ్ ను కొందరు మీడియా ప్రతినిధులు తండ్రి ఎప్పుడవుతావు  అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు రామ్ చరణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. 

‘నేను  ఇంకా పిల్లవాడిగానే భావిస్తున్నాను ఇక పిల్లల్ని ఎక్కడ కంటాను. నేను పెద్దవాడయ్యానని ఫీలైనపుడు పిల్లల  గురించి ఆలోచిస్తా’ అంటూ ఒక షాకింగ్ రిప్లయ్ ఇచ్చి మీడియా వర్గాల మైండ్ బ్లాంక్ చేసాడు చరణ్. అంతేకాదు 15 ఏళ్ల తరువాత తమ ఇంటికి మార్పులు చేయించినంత మాత్రాన తనకు పిల్లలు పుడుతున్నట్లేనా అంటూ జోక్ చేసాడు చరణ్. 

ఇక ఇదే పుస్తక ఆవిష్కరణ సభలో చరణ్ మాట్లాడుతూ తనకు తన తండ్రి చిరంజీవిని గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలిసాయి అని చెపుతూ ఈ పుస్తకాన్ని తన ఇంటి లైబ్రరీలో శాస్వితంగా దాచుకుంటాను అని చెపుతూ తన తండ్రి పట్ల అభిమానాన్ని మరొకసారి చాటుకున్నాడు చరణ్.  చరణ్ తన పిల్లల గురించి క్లారిటీ ఇచ్చేసాడు కాబట్టి ఇక మీడియా ఈ విషయంలో చరణ్ ను వేధించడం మానేస్తుంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: