ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వింత కాంపిటీషన్ కనిపిస్తుంది. ఒకప్పుడు హీరోలు,హీరోయిన్స్ మధ్య మాత్రం ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. హీరోలు, హీరోయిన్స్ కంటే దర్శకులు మధ్య ఈ పోటీ ఎక్కువుగా కనిపిస్తుంది. టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ఎక్కువుగా రావటంతో హీరోలకి కొంత ప్రాముఖ్యత తగ్గిందనే చెప్పవచ్చు. డైరెక్టర్స్ మధ్య పోటీకి హీరోలు సైతం సైలెంట్ గానే ఉంటున్నారు.
ఇదిలా ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమని బాహుబలి మూవీతో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి కంటే మించిన కమర్షియల్ డైరెక్టర్ ఇప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తూ వస్తున్న టాక్స్. అయితే రాజమౌళి పేరు తలదన్నేలా “గౌతమిపుత్ర శాతకర్ణి” మూవీతో డైరెక్టర్ క్రిష్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు బలమైన దర్శకులు ఉన్నారని తేలింది.
రాజమౌళి కంటే క్రిష్ అద్భుతంగా తెరకెక్కిస్తాడు అనే న్యూస్ సైతం ఒక సమయంలో మార్కెట్ లో హల్ చల్ చేసింది. “గౌతమిపుత్ర శాతకర్ణి” మూవీకి సంబంధించిన ట్రైలర్ దగ్గర నుండి సినిమా రిలీజ్ వరకూ అందరూ రాజమౌళిని లైట్ తీసుకొని...ఫోకస్ అంతా క్రిష్ మీదే పెట్టారు. ఇటువంటి సమయంలో క్రిష్ టాలెంట్ ని రాజమౌళి సైతం గుర్తించకపోతే...అసలకే ప్రమాధం అని రాజమౌళి భావించి ఉండొచ్చని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.
అందులోని భాగంగానే రీసెంట్ గా రాజమౌళి....క్రిష్ ని పిలిచి మరీ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో క్రిష్ టాలెంట్ ని రాజమౌళి అడిగి తెలుసుకోవటం అనేది ప్రేక్షకులకి సైతం చాలా కొత్తగా అనిపించింది. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి గొప్ప అంటూ క్రిష్ చెప్పటం మరో కొసమెరుపు. దీంతో రాజమౌళి వర్సెస్ క్రిష్ లలో ఎవరు గొప్ప అనే విషయంలో రాజమౌళీనే అనేది ఇంటర్వ్యూలో అంతర్లీనంగా కనిపిస్తూ ఉండటం విశేషం. ఇందంతా రాజమౌళి గేమ్ అనే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.