ఈమధ్య కాలంలో మహేష్ రామ్ చరణ్ ల మధ్య సాన్నిహిత్యం రోజురోజుకు పెరిగిపోతోంది. గతంలో ఈ ఇద్దరు యంగ్ టాప్ హీరోలు ఒకరి సినిమాల పై మరొకరి సినిమాలను పోటీగా విడుదల చేసుకుంటూ తమ అభిమానుల మధ్య చిచ్చు రేపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

అయితే ఏమైందో ఏమో కాని ఈమధ్య వీరిద్దరూ తెగ సన్నిహితులు అయిపోతున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో ఒకే హాలిడే స్పాట్ లో కలిసి చరణ్ మహేష్ లు కొద్ది రోజులు ఆనందంగా గడిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మహేష్ చరణ్ లు మరొక అడుగు ముందుకు వేసారు. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం కొద్ది రోజుల క్రితం మహేష్ తన భార్య పుట్టినరోజును ఒక స్టార్ హోటల్ లో నిర్వహించాడు. మహేష్ సన్నిహితులను మాత్రమే ఆహ్వానించిన ఈ వేడుకలకు రామ్ చరణ్ ఉపాసనలతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడ వచ్చాడు.  అయితే అత్యంత సింపుల్ గా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలకు చరణ్ ఉపాసనలు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ చరణ్ ల కలయిక వెనుక ఒక బిజినెస్ ఆలోచన కూడ ఉంది అన్న వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే స్పైస్ జెట్ విమానాల కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న చరణ్ త్వరలోనే మన ఇరు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో గ్రూప్ ఆఫ్ చైన్ హోటల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ స్టార్ హోటల్స్ బిజినెస్ లో మహేష్ కూడ చరణ్ తో కలవబోతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తలే నిజం అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోల పార్టనర్ షిప్ ప్రారంభం అవుతోంది అనుకోవాలి.  ఇది ఇలాగే కొనసాగితే వీరిద్దరి సాన్నిహిత్యం వల్ల రాబోయే రోజులలో మహేష్ చరణ్ ల ఒక మల్టీ స్టారర్ వచ్చినా ఆశ్చర్యం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: