తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. త్రిష,అనుష్క,కాజల్,సమంత ల ఇప్పుడు యంగ్ హీరోయిన్లు రకూల్ ప్రితి సింగ్, రాశీ ఖన్నాల, రెజినా, లావణ్య త్రిపాటి లాంటి హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉన్నారు. 2013లో విడుదలైన హిందీ చిత్రం మద్రాస్ కెఫెలో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది రాశీఖన్నా. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయికగా నటించింది.
బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ అమ్మడు వారుస చాన్స్ లతో మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతుంది. ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ కూడా ఈ బ్యూటీ ఖాతాలో లేదు. కానీ వరుసగా అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం మిగిలిన హీరోయిన్లతో పోటీపడుతోంది.
తాజాగా ఈ అమ్మడు ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలు మంచి విజయం సాధిస్తే కొంత కాలం వరకు తెలుగు తెరపై రాశీఖన్నాకు ఢోకానే లేకుండా పోతుంది. ఈ మద్య హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో కుర్రకారుని సైతం తన వైపు తిప్పుకుంటుంది ఈ ముద్దగుమ్మ.