సినిమా ఇండస్ట్రీల్లో హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ అమ్మడు రక రకాల సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా పెళ్లైన తర్వాత కథానాయికుల పరిస్థితి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ మద్య తన పెళ్లి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిన శృతి సినీ ఇండస్ర్టీలో కథానాయికలు స్థితిగతుల పై శృతి స్పందించింది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఓ సాంప్రదాయం వస్తుందని..సినిమా మంచి హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకే వెళ్తుందని హీరోయిన్ల డమ్మిగా మిగిలిపోతున్నారని వాపోయింది.
అంతే కాదు ఈ మద్య హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణం అని నాలుగు పాటలు, మూడు డైలాగులు అన్న చందంగా సాగుతుందని అన్నారు. అంతే కాదు ఈ మద్య హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుందని ఇలాంటివి స్వాగతించదగ్గ పరిణామమని శృతి తెలిపింది. ఇక పెళ్లైన నాయికలు సినిమాలకు దూరమవ్వడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నిస్తోంది. తన విషయంలో అలాంటిది జరగదని శృతిహాసన్ నిర్మొహమాటంగా చెప్పింది.
కథానాయికలు పెళ్లైన తర్వాత
భర్తకు ఇష్టం లేదని, లేకుంటే అత్తగారు వద్దన్నారనో సినిమాలకు
దూరం కావడం అత్యంత దారుణమైన పరిణామంగా శృతిహాసన్ పేర్కొంది. సమాజంలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు..అది
వారి భర్త, అత్తామామలకు అంగీకారమైతే..సినిమా కూడా ఓ
ఉద్యోగం లాంటిదే.. యాక్టింగ్ను కూడా ఇతర ఉద్యోగాల్లాగే చూడాలని
విన్నవించుకుంటోంది. తనకు పెళ్లైనా..
పిల్లలు పుట్టినా కూడా నటిస్తూనే ఉంటానని శృతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. నటన
అంటే తనకు ప్రాణమని శృతిహాసన్ చెప్పింది.