తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడు ఎవరంటే టక్కున చెప్పేస్తారు..దర్శకధీరుడు రాజమౌళి అని. ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో మొదలైన ప్రస్థానం ఇప్పటి వరకు ఆయన ఖాతాలో విజయాలే తప్ప అపజయాలు అన్నది వేసుకోలేదు. అంతే కాదు ఎప్పటికప్పుడు వైవిధ్యభరితంగా సినిమాలు తెరకెక్కించే రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశారు. ఫ్యూజువల్ వండర్ గా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ స్థాయి ప్రపంచ వ్యాప్తంగా గ్రేట్ అనిపించుకుంది. అంతే కాదు ఈ చిత్రానికి ‘జాతీయ ఉత్తమ ’ చిత్రం అవార్డు రావడం మరో విశేషం. ప్రస్తుతం ‘బాహబలి 2 ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి సినిమాపై అప్పుడే అంచనాలు పెంచేస్తున్నారు. ఇక తమిళనాట సినీ ఇండస్ట్రీలో ఆరాధ్య దైవంగా చూసుకునే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం రోబో సీక్వెల్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . దాని తర్వాత కబాలి 2 లో నటించనున్నాడు..ఇక ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత ఆయన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. చారిత్రాత్మక చిత్రాలు తీయాలని ఎప్పటి నుంచో ఆలోచనలో ఉన్న రాజమౌళి మరో వండర్ సృష్టించబోతున్నాడట.
అదే మహాభారతం లోని కొన్ని ముఖ్య ఘట్టాలతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ హీరోలను సెలక్ట్ చేసుకున్న జక్కన్న తీయబోయో మహాభారతం లో రజనీ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించనున్నాడట . ఈమేరకు సలహాలు , సంప్రదింపులు జరిగినట్లు గా కోలీవుడ్ లో కోడై కూస్తోంది .
ఆ చిత్రంలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో రజినీని కలసిన రాజమౌళి తనతో ఓ సినిమా తీయాలని ఆశిస్తున్నట్లు తెలపడం..దానికి రజినీ అంగీకరించడం కూడా జరిగిందట. ఇక రజనీ చూపిస్తే థియేటర్ లో ఈలలు , గోలలు ఉండాల్సిందే ఆ రకంగా చూపిస్తాను అని గతంలో ప్రకటించాడు జక్కన్న . మరి పౌరాణిక చిత్రమైతే రజని ని ఎలా చూపిస్తాడో చూడాలి.