తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత ఈ ఇద్దరికా ఏ సినిమా కలిసి రావడం లేదు. దీంతో మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రోబో 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అంతే కాదు వరుసగా మూవీపై హైప్ పెరిగేలా ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేస్తారట. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్గా చేస్తున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. రోబో 2తో బాక్సఫీసు వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేయాలనేది శంకర్ టార్గెట్ గా కనిపిస్తుంది. మరి రోబో 2 ఏ రేంజ్ లో సక్సెస్ కొడుతుందో చూడాలి.
ఇక ఈ చిత్రంలో ఒక్క ఫైట్ కోసం 12 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్- అక్షయ్కుమార్ల మధ్య యాక్షన్ సీన్ని ఏరియల్ స్టంట్ విధానంలో సరికొత్తగా చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. అంతే కాదు మూవీకి అదే హైలైట్ అని, దీనికోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్లు ముంబైకి రప్పించారని యూనిట్ చెబుతోంది.
ఊహకు అందని విధంగా, హాలీవుడ్ చిత్రాలను తలదన్నెలా ఈ సీన్ ఉండనుందని టాక్.తమిళనాడు న్యూఇయర్ సందర్భంగా ఏప్రిల్ 14న టీజర్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీపావళికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలన్నది స్కెచ్. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న దీనికి రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్.