భారత దేశంలో మహిళలపై గత కొన్ని సంవత్సరాలుగా లైంగిక వేదింపులు,అత్యాచారాలు, హత్యలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న ఫోర్న్ చిత్రాల ప్రభావం యువతపై బాగా చూపిస్తుందని..సెల్ ఫోన్ వాడకం తర్వాత ఇలాంటి విశృంఖలాలు విచ్చలవిడిగా పెరిగిపోయానని మహిళలలు అంటున్నారు. ఇలాంటి లైంగిక వేధింపులకు మామూలు మహిళలే కాదు సెలబ్రెటీలు కూడా బలి అవుతున్నారని తెలిసింది. తాజాగా మళయాళ సినీ నటి భావన లైంగిక వేధింపులకు గురైంది.
తెలుగుతో పాటు పలు సౌత్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ భావన ముగ్గురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి ఎర్నాకులంలో తన షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె ఫిర్యాదు చేసారు. హీరోయిన్ భావన వద్ద సునీల్ అనే వ్యక్తి కొన్ని నెలలుగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తాను అందుబాటులో లేక పోవడంతో శుక్రవారం మరో వ్యక్తిని తన స్థానంలో పెట్టినట్లు తెలుస్తోంది.
లైంగిక వేధింపులకు గురిచేసి, కారులోనే వేధించి చివరకు వదిలేశారు. దాదాపు గంట సేపు కారులో తీసుకెళ్లిన దుండగులు ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టారు. ఆ గ్యాంగ్ హీరోయిన్ ఫోటోలను, వీడియోలను కూడా తీసినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో భావన మాజీ డ్రైవర్ మార్టిన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సునిల్ పరారీలో ఉన్నాడు. వేధింపులకు గురైన హీరోయిన్ మొదట డైరెక్టర్ను ఆశ్రయించింది.
ఆ డైరక్టర్ ఫిర్యాదు మేరుకు పోలీసులు షూటింగ్ స్పాట్కు వచ్చారు. తెలుగులో ఒంటరి, మహాత్మా, హీరో, నిప్పు చిత్రాల్లో భావన నటించింది. తన భయానక అనుభవాన్ని ఫ్రెండ్ తో షేర్ చేసుకున్న భావన ఆ ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిలో ఒకరైన డ్రైవర్ ను అరెస్టు చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.