టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఒక ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తే చాలు ఆ ప్రోడక్ట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరికీ తెలిసిపోతుంది అన్న నమ్మకం మల్టీ నేషనల్ కంపెనీలకు ఎప్పటి నుంచో ఉంది. ఆ నమ్మకం వల్లే అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.  

మహేష్ కు సినిమాలలో వచ్చే ఆదాయం కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఈ బ్రాండ్ ఎండార్స్ మెంట్లు వల్ల మహేష్ కు కోట్లు కురుస్తున్నాయి అంటే మహేష్ క్రేజ్ ఏరేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. ఇప్పటికే థమ్స్ అప్ లాంటి భారీ మల్టీ నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న మహేష్ లేటెస్ట్ గా మరో మల్టీ నేషనల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎయిర్ కండిషన్లు, ఇతర గృహోపకరణాలు అందించే లాయిడ్ కంపెనీ ఆంధ్ర, తెలంగాణ లకు తమ ప్రొడక్ట్ ప్రమోషన్ కు గాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ ఎండార్స్ మెంట్ ఎగ్రిమెంట్ ద్వారా కూడ మహేష్ కు భారీ పారితోషికం ముడుతున్నట్లు టాక్.

త్వరలోనే మహేష్ బుల్లితెర పై అదేవిధంగా పెద్దపెద్ద పత్రికలలో కనపడుతూ లాయిడ్ ఎసి లు, టీవీలు ఇతరత్రా ఉత్పత్తులు కొనమని రికమెండ్ చేయబోతున్నాడు.  అయితే ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో కొందరు ఈ విషయమై సెటైర్లు వేస్తున్నారు. 

గ్లామరస్, క్రేజీ ఏక్టర్లు ప్రమోట్ చేసినంత మాత్రాన జనం కొనేరోజులు ఎప్పుడో పోయాయి అని అంటూ ఎటొచ్చీ ఆ బ్రాండ్ పేరు కాస్త బలంగా జనంలోకి వెళ్తుంది కానీ సేల్స్ అద్భుతంగా పెరిగిపోతాయి అనుకోవడం అవివేకం అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.  ఇలా సెటైర్లు వేయడానికి గల కారణం ఈమధ్య అమరావతి లోని ఒక భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కు సేల్స్ పెంచడానికి మహేష్ స్వయంగా ప్రచారం చేస్తూ రంగంలోకి దిగినా ఆ ప్రాజెక్ట్ పెద్దగా క్లిక్ కాలేదని వార్తలు వస్తున్నాయి.  దీనితో రాబోతున్న సమ్మర్ లో మహేష్ క్రేజ్ లాయిడ్ కంపెనీకి ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: