ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్త విలన్స్ ఎక్కువుగా వస్తున్నారు. కొత్తదనం కోసం నిర్మాతలు, హీరోలు, దర్శకులు అంతా కొత్త ఆర్టిస్ట్ లకి వెల్‌ కం చెబుతున్నారు. ఆ విధంగానే ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో‘ఠాకూర్ అనూప్ సింగ్’ అనే విలన్ స్టార్ హీరో సినిమాల్లో కనిపిస్తున్నారు. ఆ విధంగా వచ్చిన ‘ఠాకూర్ అనూప్ సింగ్’మొదట పూరి జగన్నాథ్ ‘రోగ్’ చిత్రంలో నటించారు.


అయితే ఈ మూవీ విడుదల కాకముందే సూర్య చేసిన భారీ ప్రాజెక్ట్‘సింగం 3’ లో విలన్ గా నటించి ఇప్పుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉన్న సాయి ధరమ్ ‘విన్నర్’ చిత్రంలో ‘ఠాకూర్ అనూప్ సింగ్’ విలన్ గా నటించారు. ‘సింగం 3, విన్నర్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ‘ఠాకూర్ అనూప్ సింగ్’ తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.


ఇక స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల్లో విలన్ పాత్రలు చేయాలని ‘ఠాకూర్ అనూప్ సింగ్’ తన ఆలోచనని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా  పెద్ద హీరోల మూవీలలో ఆఫర్ వస్తే రెమ్యునరేషన్ సైతం తగ్గించుకొని చేస్తానని కొంత మంది మేనేజర్స్‌ కి చెప్పుకొచ్చారంట. దీని కారంణంగా చాలా మంది ‘ఠాకూర్ అనూప్ సింగ్’ ని పెద్ద హీరోల మూవీలలో తీసుకోవాలని చూస్తున్నారు.


అయితే ‘ఠాకూర్ అనూప్ సింగ్’ వరుసగా పెద్ద హీరోల మూవీలో తక్కువ రెమ్యునరేషన్ కే సినిమాలు చేస్తే...ఈ ఎఫెక్ట్ ఇతర యాక్టర్స్ పై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ ఈ ఆఫర్ ని పవన్ కళ్యాణ్‌ కి ఎవరైనా చెబితే...వెంటనే ఈ విలన్ కి ఆఫర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఉచితంగా సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్‌ నిర్మాతలు వెంటనే ఒప్పుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: