దేశంలో మహిళలపై రోజు రోజుకీ అత్యాచారాలు, లైంగిక వేదింపులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఏదో ఓ సందర్భంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా కొంత మంది కామాంధులను మార్చలేక పోతున్నారు. ఈ కామాంధులు సెలబ్రెటీలను కూడా వదలడం లేదు..ఈ మద్య మళియాళ సినీ నటి భావనను కారులో బంధించి లైంగిక వేదింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేరం చేసింది తన వద్ద కారు డ్రైవర్ గా పని చేసిన వ్యక్తి కావడం మరో విశేషం.
ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో హీరోయిన్ ని కూడా ఇలాంటి వేదింపులకు గురైన విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందట. ఓ ప్రముఖ టీవీ ఛానెల్కు చెందిన ప్రోగ్రామింగ్ హెడ్ తనతో నీచంగా మాట్లాడారని వరలక్ష్మి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు తర్జనభర్జన పడి ఇక ఆగలేక చెప్పేస్తున్నానని అన్నారు. ఓ రోజు ప్రముఖ టీవీ ఛానెల్ ప్రోగ్రామింగ్ హెడ్తో దాదాపు అర్ధగంట చర్చ అయ్యాక ‘మనం ఎప్పుడు బయటకలుద్దాం..?’ అని ఆయన నాతో అన్నారు.
‘ఇంకేదైనా పని మీదా..?’ అని అడిగా. ఆయన నవ్వుతూ మరోలా చూస్తూ.. ‘లేదు.. పని కాదు. మిగిలిన పనుల కోసం’ అని పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. నేను కోపాన్ని నిగ్రహించుకుంటూ ‘క్షమించండి.. దయచేసి వదిలేయండి’ అన్నాను. ‘అయితే.. అంతేనా?’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు’. సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ గా కనిపించినంత మాత్రాన వారి క్యారెక్టర్లు కూడా ఇలాగే ఉంటాయనుకోవడం తప్పని వరలక్ష్మి అంటుంది. మాజంలో మహిళకు భద్రతలేదని ఆవేదన చెందుతూ..ఇక ముందు తానూ మౌనంగా భరించనని, అలాగే బాధితులెవరైనా సరే మౌనంగా బాధపడక మాట్లాడాలని పిలుపునిచ్చారు.
వరలక్ష్మి ట్విట్ :