మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 నిర్మించిన సంగతి తెలిసిందే. నిర్మాతగా సూపర్ సక్సెస్ అయిన చెర్రి చిరు 151వ సినిమాను కూడా తనే నిర్మిస్తుండటం విశేషం. ఇక ఇదే కాకుండా నందమూరి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తారని ఎక్స్ క్లూజివ్ టాక్.


మెగా ప్రొడక్షన్ నందమూరి హీరో.. అబ్బో ఈ క్రేజీ కాంబినేషన్ కలవాలే కాని సంచలనం సృష్టించడం ఖాయం. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా చర్చల్లోకి వచ్చింది అంటే. ప్రస్తుతం బాబి డైరక్షన్ లో సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ త్రివిక్రం సినిమా చేస్తాడని టాక్ ఉంది. పవర్ స్టార్ తో త్రివిక్రం సినిమా పూర్తి కాగానే తారక్ తో సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.


త్రివిక్రం తారక్ సినిమాను చరణ్ నిర్మిస్తాడని అంటున్నారు. మెగా క్యాంప్ కు త్రివిక్రం చాలా సన్నిహితుడు ఆ రిలేషన్ తోనే తారక్ సినిమాను తాను నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాడు చెర్రి. అదే కనుక కన్ఫాం అయితే మెగా ట్రెండ్ సృష్టించడం ఖాయం. స్టార్ హీరోలంతా స్నేహభావంతో ఉంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే మెగా నందమూరి క్యాంప్ ల మధ్య రిలేషన్ ఇంకాస్త బలపడినట్టే అవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: