అఖిల్ అక్కినేని పెళ్ళి గురించి ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.  ఈ రూమర్స్ ఎలా బయటకు వచ్చాయో స్పష్టమైన క్లారిటీ లేకపోయినా బయటకు వచ్చిన ఈ న్యూస్ అందరికీ షాక్ ఇస్తోంది. కొద్ది రోజుల క్రితమే జివికె ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మధ్య వియ్యం కుదరింది. 

జివికె మనవరాలిని అక్కినేని అఖిల్ ప్రేమించడంతో వారిద్దరి పెళ్లికి పెద్దలు పచ్చజెండా ఊపడమే కాకుండా అత్యంత వైభవంగా వారి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఆ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు విపరీతంగా మీడియాకు కూడ విడుదల చేసారు. 

అయితే మరి కొద్దిరోజులలో అఖిల్ మ్యారేజ్ జరగబోతోంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమధ్య అఖిల్ శ్రియ భూపాల్ ల పెద్దలు ఈమధ్య సమావేశం అయి ప్రశాంతంగా చర్చించుకుని, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అఖిల్ శ్రియల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు అని అంటున్నారు. 

పెళ్లి అయిన తరువాత వారిద్దరు ఇబ్బంది పడేకన్నా వారిద్దరూ ఈ భేధాభిప్రాయాల మధ్య విడిపోవడమే బెటర్ అన్న ఆలోచనలతో ఇరు వర్గాలు ఈ పెళ్లి వ్యవహారాన్ని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పెళ్లిని ఇటలీలో చేయాలనుకున్నారు. రెండు కుటుంబాలకు సంబంధించిన సుమారు 100 మందికి ఎయిర్ టిక్కెట్స్ హోటల్ ఎకామిడేషన్ ఇప్పటికే బుక్ చేసారు. 

వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయిన నేపధ్యంలో ఇటలీ ట్రిప్ కు సంబంధించిన ఎయిర్ టిక్కెట్స్ తదితర విషయాలను కూడ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఘాడంగా ప్రేమించుకున్న అఖిల్ రియ భూపాల్ లు ఇలా విడిపోయారు అని న్యూస్ రావడం వారిద్దరి కుటుంబాలకు మాత్రమే కాకుండా అందరికీ షాకింగ్ గా మారిన విషయం..  



మరింత సమాచారం తెలుసుకోండి: