‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా ఫెయిల్ అయిన తరువాత నాగార్జున ఓంకార్ తీస్తున్న ‘రాజుగారి గది 2’ షూటింగ్ కు గతవారంలో నాగ్ జాయిన్  అవుతాడు అని అనుకున్నారు అంతా. అయితే నాగార్జున గతకొద్ది రోజులుగా అన్నీ అపాయింట్ మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని తన ఇంటికే పరిమితం అయిన నేపధ్యంలో నాగార్జునకు ఆరోగ్యం సరిగ్గా లేదేమో అని అనుకున్నారు చాలామంది. 

మరి కొందరైతే ఇదంతా ‘ఓం నమో వెంకటేశాయ’ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన వైరాగ్యం అని అనుకున్నారు. అయితే ఇప్పుడు అఖిల్ పెళ్లి గురించి షాకింగ్ న్యూస్ బయటకు రావడంతో నాగార్జున బెంగకు సంబంధించిన కారణాలు బయటకు వస్తున్నాయి. దీనితో నాగ్ బెంగ ‘ఓం నమో వెంకటేశాయ’ గురించి కాదు అఖిల్ గురించి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొదట్లో క్రికెటర్ అవుతాడు అనుకున్న అఖిల్ సినిమాల పై మోజు పెంచుకుని హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాగా మంచి కథ కోసం ఎదురు చూస్తున్న నాగార్జున ఆలోచనలకు భిన్నంగా ఒక మామూలు రొటీన్ సినిమా చేసి ఎవరినీ మెప్పించ లేకపోయాడు అఖిల్. 

ఆ తరువాత తన నిర్ణయం తప్పు అని తెలుసుకున్న అఖిల్ తన సినిమాల విషయంలో నాగార్జున మాట వింటానని మాట ఇచ్చి తన రెండవ సినిమాకు సంబంధించి అనేక దర్శకులు చెప్పిన కథలు విన్నాడు. అయితే ఇక్కడ కూడ అఖిల్ నాగార్జునకు చుక్కలు చూపించాడు అన్న మాటలు ఉన్నాయి. 

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అఖిల్ విక్రమ్ కుమార్ చెప్పిన కథకు ఓకె చేసినా ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో అఖిల్ తనకు కొన్ని తలనొప్పులు తెచ్చి పెడుతున్నాడు అంటూ విక్రమ్ కుమార్ నాగార్జునకి కంప్లయింట్‌ చేసాడు అన్న రూమర్లు కూడ ఉన్నాయి.  దీనితో అఖిల్‌ కెరియర్‌ని చక్కదిద్దే వరకు 
కొత్త కమిట్‌ మెంట్లు పెట్టుకోరాదని నాగార్జున ఆలోచిస్తూ తగిన సమయం కేటాయిస్తూ ఉన్నా అఖిల్ పై వస్తున్న రకరకాల వార్తలకు ఏమి చేయలేక మౌనంగా ఉంటున్నాడు నాగ్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: