ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఉలిక్కి పడిన వార్త అఖిల్ - శ్రీయా భోపాల్ ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం. అందరికీ ఇది సడన్ సర్ప్రైజ్ లాగా జరిగిపోయింది.వాళ్ళిద్దరి బంధం బీటలు వారబోతోంది అన్నది షాకింగ్ వ్యవహారం లాగా ఉండ. అఖిల్ - శ్రియ లది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. వారిద్దరూ ఎంతో కాలంగా ప్రేమలో ఉంటూ క్లోజ్ అయ్యి కలిసి ఉండి మరీ పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. నిశ్చితార్ధం ఘనంగా పూర్తి చేసుకున్న వారు ..  ఇప్పటికే ఇటలీ లో పెళ్లి కోసం టికెట్ లు కూడా బుక్ చేసుకున్నారు . ఇటలీ లో పెళ్లి అఖిల్ ఐడియా గ్రాండ్ గా సముద్రం ఒడ్డున చేసుకోవాలి అని అఖిల్ ప్లాన్ చేసుకున్నాడు. శ్రియ కి కూడా అది బాగా నచ్చి ఓకే చెప్పింది. కానీ ఇంతలో ఏమైంది అనే వెర్షన్ చూస్తే మనకి కొత్త విషయాలు బయట పడుతున్నాయ్.అఖిల్ - శ్రియ పెళ్లి నాగార్జున ఇంట్లో ఫుల్ గా ఓకే అయినా జీవీకీ ఫామిలీ కే కాస్త ఇబ్బంది గా ఉందట. మొదటి నుంచీ వారి వైపు నుంచి అభ్యంతరాలు వినపడ్డాయి అని సమాచారం. అఖిల్ - శ్రియా లు పెళ్లి చేసుకుని తీరాలి అనీ కెరీర్ కంటే పెళ్ళే ముఖ్యం అని వారు పట్టు బడుతూ ఉంటే ఇద్దరూ కాస్త మొండికేయడం తో జీవీకీ ఫ్యామిలీ ఒప్పుకున్నారట. నిశ్చితార్ధం హడావిడి కూయడ రెండు ఫామిలీ లకీ పెద్ద ఇష్టం లేదు. అఖిల్ - శ్రియ లు ఇద్దరూ ఒక నిశ్చితార్ధం డేట్ ఫిక్స్ అయ్యి ఆ రోజున చెయ్యాల్సిందే అంటూ పట్టు పట్టారట. ఇలా తెర ముందర జరుగుతున్న వ్యవహారం జీవీకే కి ఇష్టం లేకపోయినా గొడవ ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నారు. అక్కినేని వారికీ జీవీకే వారికీ నిస్చితార్త్ధం తరవాత నుంచీ కమ్యునికేషన్ గ్యాప్ బాగా ఎక్కువ అయ్యింది. ఇద్దరి బంధం ముందరకి వెళుతుందా లేదా అనే ప్రశ్నలు సైతం ఉదయించాయి. ఇక ఈ బంధం.. ముందుకు వెళ్తుంద‌న్న న‌మ్మ‌కం రెండు కుటుంబాల‌కూ లేక‌పోవ‌డం వ‌ల్ల, ప‌ర‌స్ప‌రం మాట్లాడుకొని పెళ్లి ఆపేద్దామ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పెళ్లి జరిగి తీరాలి అని నాగార్జున ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు అని చెబుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: