టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాహీరోల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న మెగాహీరోలలో సాయిధరమ్ తేజ్ స్పీడు చూస్తుంటే స్టార్ డంని మరికొద్ది సినిమాలతో తెచ్చుకుంటాడేమో అని అనిపిస్తుంది. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రాలు కమర్షియల్ హిట్స్ గా నిలుస్తున్నాయి. తను చిత్రాలను వేగంగా రిలీజ్ చేసుకోవటమే కాకుండా…తన పాత్రలతో ప్రేక్షకుల్లోనూ రిజిస్టర్ అయ్యేవిధంగా చూసుకుంటున్నారు.


ఇది సాయిధరమ్ తేజ్ కి ఎంతో ప్లస్ గా మారుతుంది. ఇక తను నటిస్తున్న చిత్రాలకి హిట్స్…ప్లాప్స్ అనే తేడా లేకుండా యావరేజ్‌ టాక్స్ తో ముందుకు వెళుతున్నాడు. ఆ విధంగానే సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటించిన చిత్రం విన్నర్. ఇక విన్నర్ మూవీకి సంబంధించిన టాక్స్ ని ప్రేక్షకులు ఆలోచించే లోపే…తను నక్షత్రం అంటూ తన అప్ కమింగ్ మూవీతో హడావిడి క్రియేట్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ తాజాగా తన మేనమామ అయిన చిరంజీవికి కన్నీళ్ళని తెప్పించాడని అంటున్నారు. పిల్మ్ ఇండస్ట్రీలో వినపిస్తున్న ఈ వివరాలను చూస్తే…. సాయిధరమ్ తేజ్ అంటే మెగాహీరోలకి విపరీతమైన అబిమానం ఉంటుంది. ముఖ్యంగా చిరు, పవన్, నాగబాబులకి సాయిధరమ్ తేజ్ అంతే విపరితమైన ఇష్టం. వీరిలో చిరుకి సాయిధరమ్ తేజ్ యాక్టింగ్ ని తెగ ఎంజాయ్ చేస్తాడంట.


సాయిధరమ్ తేజ్ చేస్తున్న యాక్టింగ్ లో తనని తాను చూసుకుంటున్నట్టుగా ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారంట. ఇక విన్నర్ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ ని చూసినప్పుడు సాయిధరమ్ తేజ్ చూపించిన యాక్టింగ్ కి తన కళ్ళల్లో కన్నీళ్లు తిరగాయని చెప్పుకొచ్చారు. సాయిధరమ్ తేజ్ ఇంత త్వరగా తన నటనలో పరిపక్వతని చూపించటం తనకే ఆశ్ఛర్యాన్ని ఇస్తుందని మెగాస్టార్ చెప్పుకురావటం విశేషంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: