మెగాస్టార్ పవర్ స్టార్ తో పాటుగా మెగా హీరోలందరితో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నానంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బిరామిరెడ్డి ఎనౌన్స్ చేశారు. దీని గురించి మెగా సోదరులు తమకు తెలియదన్నట్టు ప్రవర్తించినా సుబ్బిరామిరెడ్డి మాత్రం ఈ సిమిమా ఉండి తీరుతుంది అని గట్టిగా చెబుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందట.


ఈ సినిమా గురించి హార్వర్డ్ లో పవన్ ప్రస్థావిస్తూ అలాంటిదేమి లేదని అన్నాడు. మరో పక్క చిరంజీవి కూడా ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు. కాని ఎవరు ఔనన్నా కాదననా ఈ సినిమా ఉంటుంది అని మళ్లోసారి చెబుతున్నారు సుబ్బిరామిరెడ్డి. తనతో పాటు అశ్వనిదత్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవుతారని అన్నారు. 


మెగాస్టార్ పవర్ స్టార్ లకు ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడామని.. వారు కూడా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు సుబ్బిరామిరెడ్డి. మరి సినిమా చేస్తున్నాం అంటే ఫ్యాన్స్ గోల భరించలేం అనుకున్నారో ఏమో ప్రస్తుతానికి ఈ సినిమా రూమర్ మాత్రమే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు మెగా సోదరులు. త్రివిక్రం ఇప్పటికే ఈ సినిమా కథ రెడీ చేసే ప్రయత్నం మొదలు పెట్టాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: