సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన విన్నర్ చిత్రం నేడు థియోటర్స్ ని హిట్ చేసింది. ఈ మూవీని డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన విన్నర్ చిత్రాన్ని ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం మొదటి షోకే చూడటానికి ఆసక్తిని కనబరిచారు. దీంతో విన్నర్ మూవీకి మొదటి రోజు ఓపెనింగ్స్ అధిరేలా ఉన్నాయి. పలు సెంటర్స్ లో విన్నర్ మూవీకి సంబంధించిన నాలుగు ఆటలకి హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.


ఈ మధ్య కాలంలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలలలో ఈ తరహా హంగామా అనేది విన్నర్ మూవీకే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ మూవీని చూసిన పబ్లిక్…ఈ మూవీపై పలు కామెంట్స్ ని చేస్తున్నారు. కథలో కొన్నిసీన్స్ ఓవరాక్షన్ అనిపించాయని…కొన్ని సీన్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే విన్నర్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్ చిత్రం అని చెబుతున్నారు.


చూస్తున్నంత సేపు బాగుంది అనిపించే సినిమాలా విన్నర్ ఉందని అంటున్నారు. విన్నర్ మూవీకి విభిన్నంగా ప్రమోషన్ యాక్టివిటీస్ ని చేపట్టడంతో ప్రతి ఒక్కరికి విన్నర్ మూవీపై ఓ ఆసక్తి క్రియేట్ అయింది. దీని కారణంగా చాలా మంది ప్రేక్షకులు విన్నర్ మూవీకి రావటం జరిగింది. డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ కథపై కాస్త జాగ్రత్త చూపించినట్టుయితే ఇంకాస్త బాగుండేది అంటూ పబ్లిక్ నుండి వస్తున్న కామెంట్స్.


ఈ రోజు మహాశివరాత్రి కావడంతో ఈ మూవీని చూడటానికి యూత్ ఎక్కువుగా థియోటర్స్ కి వస్తున్నారు. ఇక విన్నర్ మూవీలో యాంకర్ సుమ పాడిన పాటకి అనసూయ డ్యాన్స్ చేయటం ప్రేక్షకులకి కొత్తగా అనిపించింది. పాటకూడ మంచి ఊపుగా ఉండటంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న 'విన్నర్' చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మించారు. విన్నర్ మూవీపై పాజిటివ్ టాక్ రావటంతో డిస్ట్రిబ్యూటర్స్ కాస్త రిలీఫ్ ని పొందారని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: