దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తరువాత చిరంజీవి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ 100కోట్ల నెట్ కలక్షన్స్ ను అందుకుని తన హవాను చాటుకుంది. దీనితో మెగా స్టార్ మ్యానియా మళ్ళీ ప్రారంభం అయింది అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే అటువంటి మెగా స్టార్ కు హాట్ యాంకర్ అనసూయ మ్యానియా ఊహించని షాక్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
ఖైదీ’ సూపర్ సక్సస్ తరువాత చిరంజీవి నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ప్రారంభం అయింది. ఇప్పటి వరకు మూడు వారాలు ప్రసారం అయిన ఈసోకు వస్తున్న రేటింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ‘స్టార్ మా’ యాజమాన్యం కోటీశ్వరుడు షోకు 10 టి ఆర్ పి రేటింగ్స్ వస్తాయి అని ఆశించారు. 

అయితే ఈషోకు ఇప్పటి వరకు 5.80 రేటింగ్స్ మించి రాకపోవడమే కాకుండా వారం వారం గడుస్తున్న కొద్దీ ఈ షోకు మరింత రేటింగ్స్ తగ్గిపోతూ ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు ఊహించని షాక్ ఇస్తూ చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకన్నా యాంకర్ అనసూయ నిర్వహిస్తున్న ‘డేట్ విత్ అనసూయ’ కార్యక్రమానికి మంచి రేటింగ్స్ వస్తు ఉండటం బుల్లితెర వర్గాలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు అనసూయ షోకు 6.5 రేటింగ్స్ రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సిరీస్ పట్ల బుల్లితెర ప్రేక్షకులలో క్రేజ్ తగ్గిందా ? లేదంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చిరంజీవి పట్ల క్రేజ్ తగ్గిందా ? అన్న విషయమై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దాదాపు 10 వారాలు కొనసాగే చిరంజీవి ‘కోటీశ్వరుడు’ షో మూడవ వారం ముగిసే సమయానికే రివర్స్ గేర్ లోకి వెళ్ళిపోతున్న నేపధ్యంలో ఈ షోను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ‘స్టార్ మా’ సంస్థకు టెన్షన్ మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: