ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో ఏ హీరో ఏం చెప్తే కథ ఓకే చేసి సినిమాకోసం కాల్ షీట్ లు ఇస్తారు అని పూరీ జగన్నాథ్ ఓపెన్ గా చెప్పేసాడు. సినిమా నిండా తుపాకుల విధ్వంసం ఉంటె పవన్ కళ్యాణ్ ఓకే చెప్తాడు అనీ ఆ సినిమా రికార్డులు తిరగరాస్తుంది అనే ధైర్యం ఇస్తే ఎన్టీఆర్ ఓకే చెప్తాడు అనీ ఇలా ఒక్కొక్క హీరో గురించీ ఆ రోజు సరదాగా వ్యాఖ్యానించాడు పూరీ జగన్నాథ్ .


కట్ చేస్తే పూరీ కి ఇండస్ట్రీ లో ఎవ్వరూ సినిమా ఇచ్చే పరిస్థితి కనపడ్డం లేదు. అలాంటి టైం లో ఏకంగా బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు పూరీ బాబు. మరి నందమూరి నటసింహం బాలయ్య కి ఏం చెప్పి ఒప్పించాడు అసలు పూరీ లెక్క ఏంటి అనేది కాస్త లోతుగానే ఆలోచిస్తున్నారు ఫైల్మ్ నగర్ జనాలు.


బాలయ్య - పూరీ కాంబినేషన్ లో కథ ఎలా ఉండబోతోంది అని ఒకటే డిస్కషన్ లు మొదలు అయ్యాయి అప్పుడే . బాలయ్య అంటే ఫాక్షన్ గోల లో యాక్షన్ సీన్ లు ఉండాలి. రౌద్రంగా డైలాగులు చెప్పాలి .. కానీ పూరీ సినిమాలో హీరో యాటిట్యూడ్ చూపిస్తూ సరదా వేషాలు కూడా వేస్తూ ఉంటాడు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ తెర మీద ఎలాంటి ఫోకస్ ని ఇస్తుంది అనేది పెద్ద క్యూస్షన్ మార్క్. తాను బాలయ్యకి ఇచ్చిన స్టోరీ ని ఎక్కడా రివీల్ మాత్రం చెయ్యడం లేదు పూరీ జగన్నాథం.


ఒక యునీక్ పాయింట్ తో బాలయ్యని అప్రోచ్ అయ్యి ఆ తరవాత కథ గా తన పాయింట్ ని మలిచాడు అని తెలుస్తోంది. ఆ పాయింట్ ఏంటనేది పక్కపెడితే... త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమా కథను పూరి జగన్నాధ్  పూర్తిచేశాడా లేక సెట్స్ పైకి వెళ్లిన తర్వాత సీన్లు రాసుకుంటాడా అనే టెన్షన్ లో నందమూరి అభిమానులున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: