అఖిల్ అక్కినేని పెళ్ళి బ్రేకప్ అయింది అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా అక్కినేని కుటుంబానికి చెందిన వ్యక్తులతో కాంటాక్ట్ లోకి రావాలని మీడియాకు సంబంధించిన అనేకమంది ప్రముఖులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే నాగార్జున కాని అతని కుటుంబ సభ్యులు కాని మీడియాకు అందుబాటులో లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నాగచైతన్య అఖిల్ లు కూడ సోషల్ మీడియాకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నాగార్జున భార్య అమల నిన్న భాగ్యనగరంలో జరిగిన రెండు ప్రవేట్ ఫంక్షన్స్ కు అక్కినేని కుటుంబం తరఫున హాజరైంది.

అయితే ఆ ఫంక్షన్స్ లో అమలను చూసిన మీడియా వర్గాలు ఆమెతో మాట్లాడటానికి అదేవిధంగా ఆమె ఫోటోలు తీయడానికి చాలామంది ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే అమల మీడియా కంట పడకుండా చాల వేగంగా ఆ ఫంక్షన్స్ ను ముగించుకుని నెమ్మదిగా వెళ్ళి పోవడంతో అమలతో మాట్లాడుదామని ప్రయత్నించిన కొందరు మీడియా వ్యక్తులకు ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం.

అదేవిధంగా నాగార్జున ఫోన్ లో కూడ చాలామందికి అందుబాటులో లేకుండా వ్యూహాత్మక మౌనాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు అన్న వార్తలు వస్తున్ననాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ వారంతంలోగా నాగార్జున అఖిల్ వ్యవహారం అధికారికంగా స్పందించే అవకాసం ఉంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: