టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలను తెరకెక్కిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. కేవలం చిత్రాలను మాత్రమే తెరకెక్కించకుండా తనదైన శైలిలో వాటిని బ్లాక్ బస్టర్ చేయటంలో దిల్ రాజుకి తెలిసినంతగా మరో నిర్మాతకి తెలియదని చెప్పవచ్చు. సినిమా కథని ఎంచుకోవటం దిల్ రాజు తరువాతే ఎవరైనా అని అంటారు. చిన్న బడ్జెట్ చిత్రాలు అయినా…పెద్ద బడ్జెట్ చిత్రాలు అయినా దిల్ రాజు  నిర్మాణం నుండి బయటకు వస్తే అది కచ్ఛితంగా హిట్ అయి తీరాల్సింది.


ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలను చూస్తుంటే అన్నీ చిత్రాలు ఫ్యామిలీ ఓరియంటెడ్ టైటిల్స్ లాగే ఉంటాయి. ఒక్క అసభ్యకమైన టైటిల్ ని కూడ దిల్ రాజు రిజిష్టర్  చేయించటం లేదు. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ హంగుల కోసం బూతు పదాలను టైటిల్స్ గా పెట్టుకుంటుంటే…దిల్ రాజు మాత్రం ప్రత్యేక సందర్భాల్లో వచ్చే మూవీలకి అచ్ఛతెలుగు పదాలలో టైటిల్స్ ని ఎంచుకుంటున్నారు.


ఇకతాజాగా దిల్ రాజు మరో తెలుగుదనంతో ఉన్న టైటిల్ ని ఎంచుకుంటున్నారని తెలుస్తుంది. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…2017 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. విడుదలైన మూడు చిత్రాలు ‘ఖైదీ నెం 150, గౌతమిపుత్ర శాతకర్ణి,శతమానంభవతి’ భారీ విజయాలను అందుకున్నాయి. వీటిలో ‘శతమానంభవతి’ ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్రేక్షకులని మరింతగా అలరించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ దర్శకుడు సతీష్ వేగేశ్న..నిర్మాత దిల్ రాజు కలిసి మరొక సినిమా చేయనున్నారనే విషయం తెలిసిందే.


సినీ వర్గాల్లో ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ సినిమాని సైతం శతమానంభవతి తరహా కథా ప్రాముఖ్యత ఉన్న చిత్రంగా తీర్చిదిద్దాలని దిల్ రాజు భావిస్తున్నారు. అయితే ఈ మూవీకి శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. శ్రీనివాస్ కళ్యాణ్ పేరు వినగానే ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. శతమానంభవతి…శ్రీనివాస్ కళ్యాణం వంటి టైటిల్స్ పెట్టి సినిమాలను హిట్ కొట్టాలంటే అది దిల్ రాజు వంటి నిర్మాతలకే సాధ్యం అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: