‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత జూనియర్ తన కొత్త సినిమా విషయమై ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలరోజులు గ్యాప్ తీసుకున్నాడు. అనేకమంది దర్శకుల కథలు విన్న తరువాత చిట్టచివరకు ఇన్ని ఆలోచనలు తరువాత ఫెయిల్యూర్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేయబోతున్న మూవీకి ఓకె చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

‘జై లవకుశ’ అన్న పేరుతో ఈసినిమా వస్తుంది అన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన షూటింగ్ మొదలై  ఇప్పటి వరకు షూటింగ్ నడుస్తూ ఉన్నా ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఆ షూటింగ్ కు జాయిన్ అవ్వలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం తన ఫిజిక్ గురించి వచ్చిన విమర్శలు అని అంటున్నారు.

ఈమూవీ ముహూర్తం ఈవెంట్లో ఎన్టీఆర్ ను చూసి జూనియర్ ఏమాత్రం కొత్త లుక్ కోసం ప్రయత్నించలేదు అంటూ మీడియాలో వచ్చిన విమర్శలు తారక్ దృష్టికి రావడంతో అతడు ఈ కామెంట్స్ ను చాల సీరియస్ గా తీసుకుని ఈసారి తనను తాను ఇంకా కొత్తగా కనిపించాలని  విపరీతమైన కసరత్తులు చేస్తూ ఈ మూవీ షూటింగ్ కు రావడానికి ఆలశ్యం చేస్తున్నాడు అని ఫిలింనగర్ టాక్. 

ఇది ఇలా ఉండగా జూనియర్ ను తిరిగి దగ్గరకు తీసుకునే ఆలోచనలలో తెలుగుదేశ అధినాయకత్వం తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంకేతంగా ఈమధ్య జరిగిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశానికి చాలాకాలం తరువాత హరికృష్ణ రావడం అతడితో తెలుగుదేశం అధినాయకులు అంతా సన్నిహితంగా మాట్లాడటం గమనించిన వారు ఇది అంతా జూనియర్ ను దువ్వుకోవడానికి వేస్తున్న ఎత్తుగడ అని అంటున్నారు. 

ఈ వార్తలే నిజం అయితే 2019 ఎన్నికలలో ‘జనసేన’ కోసం రంగంలోకి దిగి ప్రజలముందుకు రాబోతున్న పవన్ ను అడ్డుకునే అస్త్రంగా జూనియర్ ను మార్చుకోవడానికి తెలుగుదేశం చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అనుకోవాలి. ఒకవైపు సినిమాలు మరొక వైపు తన తాత వారసత్వపు రాజకీయాలతో జూనియర్ రానున్న రోజులలో మరింత బిజీగా మారుతాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: