టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా ఈమధ్య కాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ప్రగ్యా జైశ్వాల్. మొదటి సినిమా మిర్చి లాంటి కుర్రాడులో నటించిన విషయం ఎవరికి తెలియదు కూడా. కంచె సినిమాలో కలర్ఫుల్ గా కనిపించిన అమ్మడు ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటుంది. రీసెంట్ గా నాగార్జునతో ఓం నమో వెంకటేశాయలో మరదలి పాత్రలో నటించిన ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం గుంటూరోడులో మంచు మనోజ్ సరసన నటించింది.


మార్చ్ 3న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న ప్రగ్యా అసలైన ప్రగ్యాను ఇందులో చూస్తారని అంటుంది. కంచెలో జమిందారి పాత్ర, నమో వెంకటేశాయలో కూడా పాత కాలం మరదలి పాత్ర చేసిన రెండు సినిమాలకే ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రగ్యా గుంటూరోడులో బబ్లీ గాళ్ గా నటించానని అంటుంది. తన పాత్రకు కూడా సినిమాలో ప్రాధాన్యత ఉందని అసలైన ప్రగ్యా టాలెంట్ ఏంటో ఇందులో చూస్తారని చాలెంజ్ చేస్తుంది.


టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటున్న ప్రగ్యా చేతినిండా ఆఫర్లతో కెరియర్ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఓ పక్క రకుల్ స్టార్ హీరోలతో నటిస్తుంటే రెజినా అటు స్టార్స్ తో పాటుగా యువ హీరోలతో జోడికడుతుంది. అదే దారిలో ప్రగ్యా కూడా కుర్ర హీరోలకు పర్ఫెక్ట్ పెయిర్ గా కనిపిస్తుంది. అవసరం అయితే అందాల ప్రదర్శనకు అడ్డుచెప్పను అంటూ చెప్పుకొస్తున్న అమ్మడిని త్వరలోనే అన్నివిధాలుగా వాడుతారేమో చూడాలి. ప్రస్తుతం నటించిన గుంటూరోడులో కూడా ప్రగ్యా ఎన్నడు లేని విధంగా హాట్ హాట్ గా కనిపిస్తుంది. మరి సినిమా ప్రగ్యాకు ఎలాంటి అవకాశాలను తెచ్చి పెడుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: