అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కు సంబంధించిన రికార్డులు చాల మందికి షాక్ ఇస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా విడుదలై ఈ టీజర్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకు 5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం అని బన్నీ అభిమానులు భాబిస్తూ ఉంటే ఈ టీజర్ కు లక్షకుపైగా లైక్స్, అదే స్థాయిలో డిస్ లైక్స్ రావడం ఎవరికీ అర్ధం కాని పజిల్ గా మారింది. 

దీనితో ఈ వ్యవహారం అంతా పవన్ అల్లుఅర్జున్ అభిమానుల మధ్య జరుగుతున్న వార్ కు పరాకాష్టగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ తో కొంతకాలంగా విబేధిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానుల హస్తం ఈ వ్యవహారం వెనుక ఉంది అన్న అనుమానాలు ఇప్పటికే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. 

అయితే పవన్ పరాజయాల బాటలో ఉన్నప్పుడు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ తీసిన సినిమా అని కూడ లెక్క చేయకుండా పవన్ అభిమానులు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.  ఇలాంటి పరిస్థుతులలో హరీష్ శంకర్ చేసిన లేటెస్ట్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 

ఈ ట్విట్ చాల భావయుక్తంగా ఉండటమే కాకుండా అంతర్లీనంగా పవన్ అభిమానులను టార్గెట్ చేస్తున్న విధంగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హరీష్ ట్విట్ ఈ విధంగా కొనసాగింది.‘నిప్పులు చిమ్ముకుంటూ - నింగికి నే ఎగిరిపోతే - నిబిడాశ్చర్యం లో వీరు -  నెత్తురు కక్కుకుంటూ నెలకు నే -  రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే - యద్భావం తత్ భవతి.’ అంటూ హరీష్ శంకర్ తన కోపాన్ని ‘దువ్వాడ జగన్నాధం’ టీజర్ ను అయిష్టపడుతున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ ట్విట్ చేసాడు. 

అయితే ఇంత భావయుక్తమైన ట్విట్ డీజె టీజర్ ను వ్యతిరేకిస్తున్న వర్గం వారికి అర్ధం అవుతుందా అన్నదే ప్రశ్న. మరి హరీష్ శంకర్ ట్విట్ పై బన్నీని వ్యతిరేకిస్తున్న వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: