ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు పైరసీ చోరులు. ఎలాంటి సినిమా అయినా సరే థియేటర్లో కి వచ్చిన మూడు గంటల్లోనే నెట్ లో పెట్టడం..దాన్ని పైరసీ చేసి సిడిలుగా మార్చి అక్రమంగా అమ్మడం చేస్తున్నారు. అంతే కాదు కొన్ని సినిమాలైతే మరీ ఘోరంగా రిలీజ్ కాక మునుపై నెట్ లో పెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు విడుదల కాగానే వెంటనే నెట్ లో ప్రత్యక్షం కావడం పై దర్శక, నిర్మాతలు ఆందోళనకు గురిఅవుతున్నారు.
తాజాగా ఈ పైరసీ భూతానికి మరో సినిమా బలైంది. తాజాగా కంగనా రనౌత్ , సైఫ్ అలీఖాన్ , షాహిద్ కపూర్ లు నటించిన రంగూన్ సినిమా మొత్తం లీక్ అయ్యింది . రంగూన్ ఈనెల 24న రిలీజ్ అయ్యింది . అలా రిలీజ్ అయ్యిందో లేదో సినిమా మొత్తం లీక్ కావడంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ షాక్ అయ్యింది. అదికూడా హెచ్ డీ ప్రింట్ కావడంతో అసలు దీన్ని ఎవరు లీక్ చేశారన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి.
రెండో ప్రపంచ యుద్ధ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు చిత్ర యూనిట్ ని అభినందనలతో ముంచెత్తారు. ఇలాంటి సినిమా తీయాలంలో ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అని తెలుసు. కోట్లాది రూపాయలు పెట్టి తీసిన సినిమాకు కలెక్షన్లు అంతగా లేవు అని బాధపడుతున్న సమయంలో సినిమా మొత్తం లీక్ అయి నెట్లో ఉండటంతో తీవ్ర షాక్ లో ఉన్నారు .