ఛార్మీ పూరిజగన్నాథ్ ల సాన్నిహిత్యం పై ఇప్పటికే అనేక రకాల వార్తలు వచ్చాయి.  ఈ వార్తలను పూరి ఖండించిన సందర్భాలు కూడ ఉన్నాయి. అయితే పూరి జగన్నాథ్ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ వ్యవహారాలను ఛార్మీ నిర్వహిస్తోంది అని చాలామంది అంటారు. 

దీనితో వీరిద్దరి సాన్నిహిత్యం పై వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో పూరి బాలకృష్ణతో తీయబోతున్న లేటెస్ట్ మూవీలో తనకు ఒక ప్రత్యేక పాత్ర కానీ లేదంటే ఒక ప్రత్యేక స్పెషల్ సాంగ్ ను కాని క్రియేట్ చేయమని ఛార్మీ పూరీ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.

పూరీ బాలయ్యల కొత్త సినిమా మార్చి 9న ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో పూరీ ఇప్పటికే ఈసినిమాలో నటించే నూతన నటీనటుల కోసం అన్వేషణ కూడ మొదలు పెట్టేసాడు. ముంబాయికి చెందిన కొత్త అమ్మాయిలను బాలకృష్ణ పక్కన హీరోయిన్స్ గా పెట్టడానికి ఈనెల మొదటి వారంలో ఆడిషన్స్ కూడ జరగబోతున్నట్లు టాక్. 

సెప్టెంబర్ లో విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న ఈమూవీ షూటింగ్ మార్చి నెలాఖరు నుండే వేగంగా కొనసాగుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు పూరి బాలకృష్ణ పై చేస్తున్న ఈ ప్రయోగాల వార్తలు విని అదిరి పోతున్న బాలయ్య అభిమానులు ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న ఛార్మీ వార్తలు విని మరింత షేక్ అవుతున్నట్లు టాక్. 

‘శాతకర్ణి’ ఘన విజయం తరువాత 50 కోట్ల కలక్షన్స్ హీరోగా మారిన బాలకృష్ణ ఇలా అనుకోకుండా పూరీ మాయలో పడిపోయాడా ? అన్న అనుమానాలు బాలయ్య అభిమానులు వ్యక్త పరుస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడ బాలయ్యకు తెలియకుండా పూరీ నిర్ణయాలతో జరుగుతోందా అన్న సందేహాలు కూడ బాలకృష్ణ వీరాభిమానులకు ఉంది..  
  


మరింత సమాచారం తెలుసుకోండి: