ఏప్రియల్ 28న ‘బాహుబలి 2’ విడుదల కాబోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు రెండు వారాలు ముందు కాని ఈసినిమా విడుదల తరువాత మరో రెండు వారాల వరకు కాని ఏ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సాహసించడం లేదు. బాలీవుడ్ లో కూడ ఇలాంటి పరిస్థితి ఏప్రియల్ మే నెలలలో ఏర్పడుతోంది అంటే ‘బాహుబలి 2’ సునామి గురించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతగా భయపడిపోతోందో అర్ధం అవుతుంది.

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఒక యంగ్ హీరో ఒక మీడియం బడ్జెట్ తో తీసిన తన సినిమాను ‘బాహుబలి’ సునామీని లెక్క చేయకుండా ‘బాహుబలి 2’ విడుదలైన రెండు వారాలకే విడుదల చేయబోతూ ఉండటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ‘బాహుబలి 2’ విడుదల తరువాత కనీసం ఒక నెల వరకు ధియేటర్లు దొరుకుతాయా ? అని టాలీవుడ్ దర్శక నిర్మాతలు భయపడుతూ ఉంటె ఆ భయాలు ఏమి పెట్టుకోకుండా ఈ యంగ్ హీరో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే నిఖిల్ హీరోగా తెర‌కెక్కుతున్న ‘కేశవ‌’ మూవీని సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈమూవీ రిలీజ్ డేట్ ను ఈ సినిమా యూనిట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ‘కేశ‌వ’ చిత్రాన్ని మే 12న విడుదల చేయబోతున్నారు. 

ఎన్నో అంచనాలు ఉన్న ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ సినిమాలు కూడ ఈ సాహసాన్ని చేయడానికి భయపడిపోతూ ఉంటే ఎటువంటి భయం లేకుండా నిఖిల్ చేస్తున్న సాహసం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ మూవీ మంచి రిలీజ్ డేట్ గురించి ఎదురు చూస్తోంది. 

నిఖిల్ సుధీర్ కాంబినేష‌న్లో ఇంత‌కుముందు వచ్చిన ‘స్వామిరారా’ సూప‌ర్ హిట్ అయిన నేపధ్యంలో అదే సెంటిమెంట్ ను కొనసాగిద్దామని ‘బాహుబలి 2’ ని లెక్క చేయకుండా ఈ సాహసాన్ని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని నిఖిల్ లుక్ కు మంచి క్రేజ్ వచ్చిన నేపధ్యంలో ధైర్యం చేసి ఏకంగా ‘బాహుబలి 2’ సునామీని ఎదుర్కోవడం చాలామందికి అర్ధంకాని  ప్రశ్నగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: