తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో అగ్రహీరోల సరసన నటించి తన అందాలతో యువకుల హాట్ బీట్ పెంచిన హీరోయిన్ వాణి విశ్వనాథ్. ఘరానా మోగుడు చిత్రంలో ‘కిటుకులు తెలిసిన’ పాటలో ఈ అమ్మడి అందాల ఆరబోత కుర్రకారుకి కిర్రెక్కించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ,కన్నడ,మళియాల ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించింది.
తర్వాత రోజులు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు వేస్తూ తన హవా పూర్తిగా తగ్గించుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వాణి విశ్వనాథ్ మళ్లీ వెండి తెరపై కినిపించబోతుందట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రంలో వాణి విశ్వనాథ్ నటిస్తోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అమ్మ పాత్రలో కనిపించబోతోంది.
ఇప్పటికే రమ్యకృష్ణ, మీనా, రోజా, నదియా వంటి తారలు రీఎంట్రీ బ్రహ్మాండంగా సాగిపోతోంది. ఇక వాణి విశ్వనాథ్ ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి.