తెలుగు ఇండస్ట్రీలో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటి హేమ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టిలో పడింది.   అయితే ఈసారి మీడియాపై మండిపడ్డారు. ఎవరి పైనైనా ఆరోపణలు వస్తే వెంటనే దాన్ని చిలువలుపలవలుగా చేసేసి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల వారి జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  తాజాగా ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై వస్తున్న ఆరోపణల గురించి, అవి చేసిన వారి గురించి, వాటిని క్యాష్ చేసుకుంటున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది.  
character artist hema reveals secrets of tollywood

ఈ మద్య కాలంలో సెలెబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం అయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇక వారికి సంబంధించిన ఏదైనా ఎఫైర్స్, సెక్స్ రాకెట్, లైంగిక వేధింపులు, రేప్ సంఘటనలకు సంబంధించిన వార్తలు వస్తే మీడియాలో వీటికి సంబంధించిన హడావుడి, కవరేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. అలాంటి వార్తలు ప్రసారం చేసే వారు డబ్బులు సంపాదిస్తే సంపాదించవచ్చు కానీ, ఒకరిని నాశనం చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్లు తమ కుటుంబసభ్యులకు సంతోషంగా తిండి పెట్టగలరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. , తానూ పుష్కరాలలో స్నానం చేస్తుంటే ఆ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడం, దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై హేమ ఆగ్రహంతో ఊగిపోయింది.
వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి?
ఆ పెట్టిన వాడి తల్లి లేక చెల్లి వీడియోలు ఇలాగే అప్ లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? నాకు నలభై ఏళ్ళు వచ్చేసాయి, ఇలా నా మీద ఇలా డబ్బులు సంపాదించడం కన్నా, వారింట్లో వారి మీద డబ్బులు సంపాదించుకోవచ్చు  కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఏదైనా ఇన్స్ డెంట్ జరిగితే..అందరికంటే ముందుగా ఆ వార్తలను ప్రసారం చేసి లాభపడాలనే ధ్యాసే తప్ప.... ఇలాంటి విషయాల్లో నిజా నిజాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మీడియా వల్ల కొన్ని సందర్బాల్లో ఏ తప్పూ చేయని నటీనటులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అంటున్నారు ప్రముఖ నటి హేమ. 



మరింత సమాచారం తెలుసుకోండి: