మరికొద్ది గంటలలో ప్రారంభం కాబోతున్న ‘కాటమరాయుడు’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి ముఖ్య అతిథి ఎవరు అన్న విషయమై ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ లేదు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ మాత్రమే స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాడట.

అందువల్లనే ఈ ఈవెంట్ కు ఎవర్ని పిలవలేదు అన్న వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎటువంటి హంగామా లేకుండా కేవలం అభిమానులతో సింపుల్ గా సమావేశం  పూర్తి చేయమని పవన్ ఈసినిమా నిర్మాత శరత్ మరార్ కు సూచించినట్లు టాక్. అయితే పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే త్రివిక్రమ్ మాత్రం ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

ఈమూవీలో నటించిన యూనిట్ సభ్యులు అంతా హాజరు అయ్యే ఈ ఈవెంట్ ను అలీ తన నవ్వులతో నవ్విస్తాడని తెలుస్తోంది. అయితే కొందరు పవన్ సన్నిహితులు ఈ ఈవెంట్ కు చిరంజీవిని కాకపోయినా కనీసం రామ్ చరణ్ ను పిలుద్దామని సూచించినా పవన్ ఆ సూచనల పట్ల పెద్దగా  ఆసక్తికనపరచాలేదని తెలుస్తోంది. 

అయితే పవన్ పిలిస్తే అందుబాటులో ఉన్న రామ్ చరణ్ ఈ వేడుకకు రావాలని భావించినా ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఆహ్వానం పవన్ వేపు నుంచి మెగా ఫ్యామిలీలోని ఎవరికీ అందలేదు అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో  పవన్ పిలిస్తే చిరంజీవి లేదా రామ్ చరణ్ లో ఎవరో ఒకరు వస్తారు. ఇద్దరూ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నారు. 

కానీ పవన్ నుంచి వాళ్లకు ఎలాంటి ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా  పవన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కు భారీ సన్మానం చేయాలని ఈసినిమా నిర్మాత శరత్ మరార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే ఈసన్మాన కార్యక్రమానికి మెగా యంగ్ హీరోలు ఎవరైనా వస్తారా ? రారా అన్న విషయం తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: