ప్రస్తుతం తెలుగు బుల్లితెరను ఏలుతున్న యాంకర్స్ అంతా ఒకచోట కలుసుకున్నారు. అయితే ప్రస్తుతం యాంకర్స్ అంటే నేటి యూత్ యాంకర్స్ అని. ఇందులో సుమని మినహాయించాలి. అయితే త‌ను ఎంతో ప్రత్యేకం. అయితే యూత్ కి వారి అందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్స్ అనసూయ, రష్మీ, శ్రీముఖి…అలాగే అమ్మాయిల‌ మనస్సుల్ని గిలిగింతలు పెడుతున్న రవి, ప్రధీలు లు అంతా ఒకచోట కలుసుకున్నారు.

వీరందరు ఓ చోట కలుసుకోవాలంటే ముఖ్యంగా డేట్స్ అడ్జెస్ట్ అవ్వాలి. ఆ విధంగా డేట్స్ ని అడ్జెస్ట్ చేసుకొని మరీ ఓ చోట కలుసుకున్నారు. ఇంకేముంది ఈ అల్లరి యాంకర్స్ అంతా వారి అల్లరితో పిచ్ఛి పిచ్ఛిగా ఎంజాయ్ చేశారని అంటున్నారు. వాటికి సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.

అయితే ఈ పిక్ ని పోస్ట్ చేసిన అనసూయ కాస్త ఎమోషనలైజ్ అయిందని అంటున్నారు. ఆ పిక్ తో పాటు ఓ మెసేజ్ కూడ పోస్ట్ చేసింది. తమ మధ్య పోటీ ఏమీ ఉండదని, మా యాంకర్ల ఎదుగుదలను చూసి గర్వపడుతుంటానని చెప్పంది అనసూయ. అనసూయ, రేష్మి, శ్రీముఖి, ప్రదీప్‌, రవి లు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇండస్ట్రీకి చెందిన టాప్ యాంకర్స్ అందరూ ఒకేచోట కలవటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. కానీ వీరు మాత్రం సమయం దొరికినప్పుడల్లా ఇలా కలుసుకుంటారని చెబుతున్నారు. ఇక ఈ యాంకర్స్ లో ప్రతి ఒక్కరూ 3కి మించి టివి షోలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ  ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఫిమేల్ యాంకర్స్ లోని ముగ్గురూ... హీరోయిన్స్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: