ఒకనాటి గ్లామర్ బ్యూటీ వాణి విశ్వనాథ్ త్వరలో మళ్ళీ  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.  దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీను హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో వాణి విశ్వనాధ్  తల్ల గా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఈ సందర్భoలో నిన్న ఒక ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఒకనాటి అందాల నటుడు శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. 

శోభన్ బాబు వద్ద తాను ఓ చిన్న పిల్లలా  ప్రవర్తిస్తూ ప్రతి విషయం గురించి లోతుగా తాను శోభన్ బాబును ప్రశ్నించిన  విషయాలను గుర్తుకు చేసుకుంటూ తానూ శోభన్ బాబుతో షూటింగ్ లో ఉన్నప్పుడల్లా జయలలిత గురించి అడిగిన ప్రశ్నలను గుర్తుకు చేసుకుంది.   అయితే ఆ సమయంలో అలా అడగటం తప్పా? ఒప్పా? అన్నది కూడా తనకు అప్పట్లో తెలియదు అంటూ  కామెంట్స్ చేసింది. అయితే తానూ ఎన్ని సార్లు జయలలిత విషయమై శోభన్ బాబు దగ్గర ప్రశ్నించినా ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చిన విషయాలను గుర్తుకు చేసుకుంది వాణి విశ్వనాధ్. 

అయితే  తాను ఎన్ని సార్లు అడిగినా శోభన్ బాబు మాత్రం  ‘జయలలితగారు చాలా తెలివైనవారు. చాలా పుస్తకాలు చదువుతారు’ అని నవ్వుతు చెప్పి  తప్పించుకున్న విషయాలను గుర్తుకు చేసుకుంది ఈ ఒకనాటి గ్లామర్ బ్యూటీ. జయలలిత సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లడం  తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపధ్యం అందరికీ తెలిసినదే అయినా శోభన్ బాబుతో జయలలిత అనుబంధం పై అనేక కధనాలు ఆమె మరణించినా ఇంకా హడావిడి చేస్తూనే ఉన్నాయి. 

అప్పట్లో శోభన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడిగా, గొప్ప అందగాడిగా గుర్తింపు  తెచ్చుక్కున్న నేపధ్యంలో ఆ రోజులలో ఈ అందాల నటుడితో నటించడానికి అప్పటి తరం హీరోయిన్స్ అంతా తెగ ఇష్టపడేవారు. అయితే అప్పట్లో జయలలిత అంటే శోభన్ బాబుకు ఏదో తెలియని ఆకర్షణ అని ఆమెతో సినిమాలు చేయడానికి శోభన్ బాబు ఎప్పుడు ఆసక్తి కనపరిచే వాడు అన్న ప్రచారం ఉంది. ‘డాక్టర్ బాబు’ సినిమా దగ్గర నుండి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు బాగా హిట్ అయ్యాయి. 

అయితే జయలలిత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల వైపు వెళ్లి పోయిన తరువాత ఆమె శోభన్ బాబును పూర్తిగా మరిచిపోయిందని అంటారు. ఏది ఏమైనా  ఎప్పుడో కాల గర్భంలో కలిసిపోయిన విషయాలను తిరిగి మళ్ళీ  వాణి విశ్వనాథ్ తెరపైకి తీసుకు రావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: