తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ తర్వాత చిన్న చిన్న పాత్రలు వేస్తూ ‘ఇడియట్ ’ చిత్రంతో మాస్ హీరోగా తన సత్తా చాటాడు. ఇండస్ట్రీలో మాస్ మహరాజగా పేరు తెచ్చుకున్న రవితేజ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. కాకపోతే గత మూడు సంవత్సరాల నుంచి మనోడికి బ్యాట్ టైమ్ మొదలైంది. గత సంవత్సరం బెంగాల్ టైగర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కూడా నిరాశ పరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు రవితేజ.
అయితే ఈ మద్యలోనే ఆయనపై మరి కొన్ని రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి..రవితేజ ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదని అందుకే కిక్ 2, బెంగాల్ టైగర్ చిత్రంలో మరీ సన్నగా కనిపించారని వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ..రవితేజ ఈ సంవత్సరం ఏకంగ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ చిత్రాలు చేస్తున్నాడు మాస్ మహారాజా.
ఈ రెండు సినిమాల తర్వాత రవితేజ హీరోగా కెరీర్ కి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హీరోగా రిటెర్మెంట్ ప్రకటించి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తాడట. వాస్తవానికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రవితేజ డైరెక్టర్ కావాలని ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారని కాకపోతే అదృష్టం కొద్ది హీరోగా మారానని చాలా సార్లు అన్నారు. ఇప్పుడు ఆ అనుభవంతో దర్శకుడుగా సినిమాలకి ప్లాన్ చేసుకొంటున్నట్టు చెప్పుకొంటున్నారు. రవితేజ పూర్తి స్థాయిలో దర్శకుడిగా మారనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరీ.. ఇందులో నిజమెంత అనేది చూడాలి.