విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం గురు. తాజాగా గురు మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. గతలో రిలీజ్ అయిన గురు మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో గురు మూవీపై ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ ని క్రియేట్ అయింది. ఇక ఫ్యాన్స్ అయితే విక్టరీ వెంకటేష్ నటించిన గురు మూవీని చూడటానికి తెగ ఆసక్తి చూపుతున్నారు.

ఇదిలా ఉంటే గురు మూవీ ట్రైలర్ రిలీజ్ రోజున వెంకటేష్ కి ఇద్దరు బడా నిర్మాతలు షాకింగ్ ఇచ్చారని అంటున్నారు. ఈ పరిణామాన్ని వెంకటేష్ సైతం ఊహించలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…సుధా దర్శకత్వంలో తెరకెక్కిన గురు చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్ తో పాటు రొమాన్స్ కలగలిసిన గురు ట్రైలర్ పట్ల పూర్తిగా పాజిటివ్ బజ్ ఏర్పడింది. తమిళంలో, హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం కావటంతో ఈ మూవీపై మార్కెట్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ మూవీ వెంకటేష్ కి ఏ మాత్రం సూట్ అవ్వదని ప్రముఖ నిర్మాతలు హీరోకి ఎప్పుడో చెప్పారంట. కానీ వెంకటేష్ మాత్రం ఈ మూవీలో నటించి, ఈ మూవీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చూపిస్తానని  ఆ నిర్మాత‌ల‌కి చెప్పాడంట. తాజాగా విడుదలయిన గురు మూవీ థియోట్రికల్ ట్రైలర్ ని చూసిన ఆ నిర్మాతలు…వెంకటేష్ కి రాత్రి సమయంలో కాల్ చేసి…గతంలో వారు అన్న మాటలు తప్పని చెప్పుకున్నారంట‌. ఈ పరిణామానికి వెంకటేష్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

గురు మూవీ ట్రైలర్ చాలా బాగుందని…వాళ్ళ ఎక్స్ పెక్టేషన్స్ తప్పని చెప్పటంతో వెంకటేష్ సైతం చాలా రిలీఫ్ అయ్యారంట. మొత్తంగా గురు మూవీపై అటు ఫ్యాన్స్ లోనూ, ఇటు మార్కెట్ లోనూ మంచి క్రేజ్ క్రియేట్ అవ్వంటంతో ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ సైతం బాగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వచ్చే నెలలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పై వెంకటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: