సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం అంటే ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు టాప్ హీరోలతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన మణిరత్నం మరోసారి తనదైన స్టయిల్లో ఉండే ఇన్టెన్స్ లవ్స్టోరీ తెరపైకి తీసుకు వస్తున్నారు. మణిరత్నం, కార్తీ, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ తమిళంలో 'కాట్రు వేళయిదై' పేరుతో రూపొందుతున్న చిత్రాన్ని తెలుగులో ‘చెలియా’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్ర లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసిన యూనిట్ ఆ ట్రైలర్కు రెస్ఫాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో కార్తీ చాలా స్మార్ట్ గా కనిపించాడు..తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో నెరిసిన గడ్డంతో..టెర్రరిస్టులా కనిపించాడు. మణి రత్నం మార్క్ సినిమాలను మరోసారి మన కళ్ల ముందు నిలిపింది. రోజా సినిమాలో ఉన్న లవ్.. సస్పెన్స్.. ఈ సినిమాలో కూడా రిపీట్ అవుతుందన్న అంచనాలను కలిగించింది. లవ్ కమ్ ఎఫెక్షన్ తో మొదటి ట్రైలర్ రిలీజ్ చేసిన మణి.. ఇప్పుడు రెంటో ట్రైలర్ లో సినిమా కథను కాస్త చూపించాడు.