ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అటు సినిమా పరంగా, ఇటు రాజకీయ పరంగా హాట్ టాక్స్ నడుస్తుంది ఒక్క మెగాఫ్యామిలీ పై మాత్రమే అని చెప్పవచ్చు. ఒకే ఫ్యామిలీ నుండి రెండు విభిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్న పార్టీ నాయకులు ఉండటం ఇందులోని విశేషం. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవికి ఎవరికి వారే పోటీ అన్నంతగా అభిమాన బలం ఉండటం మరో ప్రత్యేకత. ఇదిలా ఉంటే…తాజాగా పవన్ కళ్యాణ్ కి మెగాహీరో వార్నింగ్ ఇచ్చాడనే న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.


అయితే ఆ మెగాహీరో మెగాస్టార్ చిరంజీవి అని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే….జనసేన పార్టీ ఆవిర్భావం జరిగి మూడేళ్లు గడచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ పలు విషయాల గురించి ప్రస్తావించటం కూడ జరిగింది. తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ గురించి పవన్ ప్రస్తావించిన విషయం ఇందులో ఆసక్తి కరంగా మారింది.


ప్రజారాజ్యం పార్టీ సమయం లో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పారు.  అంతే కాకుండా ప్రజారాజ్యం పార్టీ లో అనేక ఆర్ధిక అవకతవకలు జరిగాయని, పార్టీ నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై రెండు రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారని అంటున్నారు. తన వ్యక్తుల ద్వార పవన్ కళ్యాణ్ కి మెగాస్టార్ చిరంజీవి సందేశాన్ని పంపారని అంటున్నారు. ఇంత ఆలోచనలు ఉన్న నీవు….నీ పార్టీని కాపాడుకోవటం తెలుసుకుంటే బాగుంటుందని ఘూటుగా చెప్పించారంట.


అన్నదగ్గర నుండి ఇలాంటి సమాధానం రావడంతో పవన్ కళ్యాణ్ కొంత షాక్ అయ్యారని అంటున్నారు. మొత్తంగా మెగాఫ్యామిలీలో రెండు పార్టీలకి సంబంధించిన లీడర్స్ ఉండటంతో….వీరి మధ్య ఇలాంటి గొడవలు సహజంగానే ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇక జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోవు ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న విషయాన్ని పవన్ చివరగా స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: