మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ అన్ని విధాలుగా సిద్ధం అవుతుంది. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి కాస్త విరామం ఇచ్చి..వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇండస్ట్రీ అంతా కలకల లాడుతుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ రాక…సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని అంటున్నారు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం తరువాత...వెంటనే మరో చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. ప్రతిభ గల దర్శకుడు క్రిష్ కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే క్రిష్ కి కథని రెడీ చేసుకోవాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి పిలువుని ఇచ్చారని అంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… క్రిష్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి ఓ స్టోరీ లైన్ ను వివరించారని అంటున్నారు.

ఈ స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయిన చిరు…కథని త్వరగా రెడీ చేసుకోవాలని చెప్పారంట. దీంతో క్రిష్ ఆఫీస్ లో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి మూవీ కథా చర్చలు, పనులు శరవేగంగా జరుగుతున్నాయని అంటున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర విజయంతో ఉత్సాహంగా ఉన్న డైరెక్టర్ క్రిష్‌ తో సినిమా చేస్తే…మంచి సక్సెస్ వస్తుందనేది మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయంగా తెలుస్తుంది. అందుకే వేగంగా క్రిష్ తో మూవీకి మెగాస్టార్ చిరంజీవి అడుగులు వేస్తున్నారు.

ఇక క్రిష్ సైతం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తను సైతం స్టార్ హీరోలతో వరుస మూవీలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకూ క్రిష్ చేసిన మూవీలలో కమర్షియల్ మూవీలు చాలా తక్కవుగా ఉన్నాయి. ఒక్క బాలయ్య మూవీ మినహాయించి మిగతా మూవీలు అన్నీ లాభాలు అంతంత మాత్రంగానే పొందాయి. అందుకే కమర్షియల్ హీరోలతో సినిమాలను తీసి కమర్షియల్ హిట్స్ ని కొడితే…మార్కెట్ లో క్రిష్ మూవీకి భారీ హైప్ క్రియేట్ అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా క్రిష్ కి మెగాస్టార్ చిరంజీవి నుండి బంపర్ ఆఫర్ తగిలిందనే చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: