తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోల మద్య పోటీ ఉంటుంది. వ్యక్తిగతంగా వారు ఒకే కుటుంబంలా ఉన్నా సినిమా విషయానికి వస్తే మాత్రం ఎవరి దారి వారిది. ఎందుకంటే సినిమాపై నిర్మాతలు పెట్టుబడి పెడతారు..వారి సినిమాలు ఎంత గొప్ప హిట్ అయితే..కలెక్షన్లు వస్తే నిర్మాతలకు అంత లాభం. అలాంటపుడు తమ సినిమాకు మరో సినిమా పోటీ అంటే కాస్త చిరాకు పడుతుంటారు. కాకపోతే గత కొంత కాలంగా టాప్ హీరోల మద్య కాస్త అండస్టాండింగ్ పెరిగినట్లు కనిపిస్తుంది.
పెద్ద సినిమాలు ఏవైనా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తే మరో పెద్ద హీరో తన సినిమా కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. గతంలో బాహుబలి చిత్రం కోసం శ్రీమంతుడు పోస్ట్ పోన్ చేయడం వల్ల రెండు సినిమాలు సూపర్ హిట్ కావడమే కాదు మంచి కలెక్షన్లతో దూసుకెళ్లాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం అగ్ర హీరోల మద్య వచ్చిన పోటీ ఎవరూ ఆపలేక పోయారు..అదే నండీ మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’, నట సింహం బాలకృష్ణ నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’.
అయితే ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి..కలెక్షన్లు కూడా హై రేంజ్ దాటాయి. ఇవన్నీ పక్కనబెడితే..పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత వరుసగా సినిమాలు వస్తున్నాయి. అయితే ఆ సినిమాల ప్రభావం ‘కాటమరాయుడు’ చిత్రంపై పడుతుందని టాలీవుడ్ వర్గం భావిస్తుంది. కానీ పవన్ మాత్రం తన ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నాడు.
తన తోటి నటులకు ఎంతో గొప్ప సహాయం చేస్తున్నాడు. అది ఏంటా అనుకుంటున్నారా..! పవర్ స్టార్ పేరు వినగానే అభిమానులకు ఎంతో జోష్ వస్తుంది.. ఈలలు గోలలు తట్టుకోవడం కష్టం. ఇక అంత సందడి ఉన్న థియేటర్స్ లో తమ చిత్ర ట్రైలర్స్ పడితే..ఒక్కసారి ఊహించుకోండి. నిజం ఇప్పుడు అదే జరగబోతుంది..కాటమరాయుడు ప్రదర్శిస్తోన్న థియేటర్స్ లో ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల ట్రైలర్స్ ప్లే కానున్నాయి.
కాటమరాయుడు విడుదలవుతున్న థియేటర్స్ లో వెంకటేశ్ గురుతో పాటు వరుణ్ తేజ్ మిస్టర్.. నిఖిల్ కేశవ.. మణిరత్నం చెలియా ట్రైలర్ లు కూడా ప్రదర్శితం కానున్నాయి. పవన్ కూడా అందరి ట్రైలర్స్ పడేలా చూసుకోమ్మని తన నిర్మాత శరత్ మరార్ కు కూడా చెప్పేసాడు. మొత్తానికి కాటమరాయుడుతో పాటు మరో నలుగురు హీరోలు మనకు కనిపించబోతున్నమాట.