సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య హీరోయిన్లు చాలా కాస్టిలీ అయ్యారు. గతంలో హీరోయిన్లతో పోల్చుకుంటే వీరి గ్లామర్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలకు పెట్టే ఖర్చు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మద్య కాలంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలు తెగ హంగామా చేస్తున్నారు. ఈ మద్య ఉత్తరాది హీరోయిన్లకు అక్కడ అంతగా అవకాశాలు లేకపోయినా.. సౌత్ లో మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నారు...వారికి డిమాండ్ కూడా అదే రీతిలో ఉంటుంది. కొంత మంది హీరోయిన్లు ఇక్కడే ఇంట్రడ్యూస్ అవడం కూడా చూస్తున్నాం.
అయితే ఇక్కడే కొన్ని చిక్కులు వస్తున్నాయట..నిర్మాతలకు. ముఖ్యంగా హీరోయిన్లు తమకు కావాల్సిన టెక్నీషియన్లను ముంబై నుంచి భారీ మొత్తం వెచ్చించి తెచ్చుకుంటారు. అక్కడి కాస్ట్లీ మేకప్ ఆర్టిస్టులు.. కాస్ట్యూమ్ డిజైనర్లు.. హెయిర్ స్టైలిష్టులు ఛార్జ్ చేసే బిల్లులను నిర్మాతలకు తడిసి మోపెడు అవుతుందట. తప్పని సరి పరిస్థితుల్లో వీరిని భరించాల్సిన పరిస్థితి వస్తుందని నిర్మాతలు వాపోతున్నారు. వీటన్నింటికి చెక్ పెడుతూ..ఆర్కే సెల్వమణి ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఫిలిం ఎంప్లాటీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఈయన తీసుకున్న నిర్ణయానికి బాలీవుడ్ భామలు ఖంగు తినడం ఖాయం..ఎందుకంటే..ముంబై హీరోయిన్లు తమిళ సినిమాల్లో నటిస్తున్నపుడు.. వారు ముంబై టెక్నీషియన్ల సర్వీసులను ఉపయోగించుకునే అవకాశం లేదని.. నిర్మాతలు ఎంపిక చేసినవారితోనే సేవలు పొందాలని కరాఖండీగా చెప్పుకొచ్చారు. మరి ఈ నిర్ణయం తమిళ ఇండస్ట్రీ తీసుకుంది..సరే మరి ఇతర ఇండస్ట్రీలు కూడా ఇదే బాటలో నడుస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
\