టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం దమ్మురేపుతున్న సినిమా కాటమరాయుడు. అన్ని థియోటర్స్ లో కాటమరాయుడు సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శన జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే కాటమరాయుడు మూవీపై మొదటి రోజు రివ్యూలు షాకింగ్ ని ఇచ్చాయి. దీంతో కాటమరాయుడు టీం ఒక్కసారిగా షాక్ అయింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… కాటమరాయుడు సినిమా మొదటి నుండే భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది.

పాటలు, టీజర్, ట్రైలర్లతో అభిమానుల్ని అలరిస్తూ ఈ మూవీపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయన్ గా నటించగా… దర్శకుడు డాలి డైరెక్ట్ చేశారు. అయితే కాటమరాయుడు మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్ కంటే బ్లాక్ బస్టర్ అయిందంటూ రిలీజ్ అయిన కొద్ది గంటల వరకూ రివ్యూలు అధరగొట్టాయి. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ…అన్ని రివ్యూలు పద్ధతిని మార్చుకున్నాయి.

మధ్యాహ్నం తరువాత చూస్తే… కాటమరాయుడు మూవీకి యావరేజ్…పర్వాలేదు అంటూ రేటింగ్స్ ని ఇచ్చాయి. దీంతో కాటమరాయుడు టీం ఒక్కసారిగా షాక్ అయింది. భారీగా థియోటర్స్ లో రిలీజ్ చేయటంతో ఈ మూవీకి మొదటి రోజు అత్య‌ధికంగా ప్రేక్షకులు వచ్చారు. సినిమాకి మొదటి 3 రోజుల్లోనే బిజినెస్ పూర్తి కావాలనేది అందరి టార్గెట్. ఆ విధంగా కాటమరాయుడు మూవీ భారీ ఎత్తున రిలీజ్ అయింది. రాయలసీమలోని ఒక ఊరికి పెద్ద గా కాటమరాయుడు ఉండి…. ఆ ఊరిలో పేదలను పీడించే ధనవంతులకు ఎదురు నిలుస్తూ పేదల బాగు కోసం పనిచేస్తుంటాడు.

ఈ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ నటన బాగున్నప్పటికీ…కొన్ని సీన్స్ వీక్ గా అనిపించాయి. ఫస్టాఫ్ వరకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనూప్ రూబెన్స్ సెకండాఫ్ కు వచ్చేసరికి సరైన మ్యూజిక్ ని అందించలేకపోయారు. అలాగే అన్ని విభాగాలకి సంబంధించిన పొరపాట్లు సెకండాఫ్ లో ఎక్కువుగా కనిపిస్తాయి. సెకండాఫ్ పై ఇంకాస్త వర్కౌట్ చేస్తే…ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది అని అంటున్నారు. మొత్తంగా రివ్యూలు అన్నీ కాటమరాయుడు పై ఒకేసారి ఎటాక్ చేయటంతో ఇది కొంత కలెక్షన్స్ పై ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: