టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ, ప్రేక్షకులకి మంచి ఎటర్టైన్మెంట్ ని అందచేస్తున్న హీరో మంచు విష్ణు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఎన్నారై స్కాంతో మంచు విష్ణు కి సంబంధాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ఇండస్ట్రీలో వినిపిస్తున్నట్టుగా ఎన్నారై స్కాంతో విష్ణుకి ఉన్న సంబంధం కేవలం సినిమాకి మాత్రమే పరిమితం అంటున్నారు.

ఈ విషయం తెలిసాక అందరూ కాస్త రిలీఫ్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్బంగా మంచు విష్ణు తన కొత్త చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు వహించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూట్ తర్వలోనే ప్రారంభం కానుందని అంటున్నారు.
అలాగే ఈ మూవీ కథని చాలా సీక్రెట్ గా ఉంచిన చిత్ర టీంకి ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వినిపించింది. ఈ చిత్రానికి సంబంధించిన కథ ఎలా బయటకు వెళ్ళిందో తెలియదు కానీ…ఇప్పుడు అందరికీ మంచు విష్ణు చేస్తున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా కథ అంతా తెలిసింది. దీనికి సంబంధించిన టాక్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతేడాది అమెరికాలో ఎన్నారైలను మోసం చేసిన కాల్ సెంటర్ల వ్యవహారం అందరికీ తెలిసిందే.

ఆ ఘటన చూసిన తర్వాత దానిపై ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను ప్లాన్ చేశామని చిత్ర టీం చెప్పిన‌ట్టుగా మాట‌లు వినిపిస్తున్నాయి. ఇక చిత్రాన్ని ఈ మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మంచు విష్ణు ‘ఓటర్’ పేరుతో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇలా కొత్త కథానాలతో ముందుకు వెళుతున్న మంచు విష్ణు…ప్రేక్షకులకి సరికొత్త ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఎన్నారై స్కాం కథపై మంచు విష్ణు భారీ అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: