దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన‌ మూవీ బాహుబలి2. ప్రస్తుతం ఈ మూవీ క్రియేట్ చేస్తున్న రికార్డ్ లు అంతా ఇంతాకాదు. రాజమౌళి సృష్టించిన బాహుబలి సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఇదిలా ఉంటే ‘బాహుబలి-2’ ఆడియో వేడుకను దర్శకుడు భారీగా ప్లాన్ చేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ వేడుకకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే అని అంటున్నారు. బాహుబలి జన్మ స్థలమైన మాహిష్మతి సామ్రాజ్యంలోనే ఘనంగా ఆడియో కార్యక్రమం జర‌గనుంది. ఇందుకు రాజమౌళి ఫిల్మ్ సిటీని వేదికగా నిర్ణయించారు. ఈ ఆడియో వేడుకకి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ తారలు హాజరుకానున్నారు.

అలాగే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తారలు సైతం బాహుబలి2 ఆడియో ఫంక్షన్ కి హాజరు కానున్నారు. ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జొహార్ హాజరుకానున్నారు. తనతో పాటు అక్షయ్ కుమార్, అలియాభట్ వంటి వారు బాహుబలి2కి హాజరుకాన్నారు. అయితే బాహుబలి చిత్రంని అతి పెద్ద చిత్రంగా చూపించటానికి కరణ్ జోహార్ కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు.

బాహుబలి2 మూవీ ప్రస్తుతం బాలీవుడ్ లో అతి పెద్ద మూవీగా రూపాంతరం చెందింది. పెద్ద పెద్ద స్టార్స్ కి సైతం సాధ్యం కాని రికార్డ్స్ ని బాహుబలి2 కైవసం చేసుకుంది. దీంతో బాహుబలి మూవీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఆడియో వేడుక మార్చి 26న సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకని చూడటానికి ప్రభాస్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఫిల్మ్ సిటీకి చేరుకోనున్నారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: