గత కొంత కాలంగా బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ కామెడీ షో. ఈటివి లో ప్రతీ గురు శుక్రవారాలు ప్రసారమయ్యే ఈ కామెడీ షో కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  మొదట్లో ఈ షోలో మంచి కంటెంట్ తో కూడుకున్న కామెడీ వచ్చేది..రాను రాను జబర్ధస్త్ లో బూతు కంటెంట్ ఎక్కువైంది.  డబల్ మీనింగ్ డైలాగులతో బూతు కామెడీని చేస్తున్నారని పలు విమర్శలకు గురవుతోంది.  అంతే కాదు ఇందులో నటులపై కూడా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి.  

ఆ మద్య ఓ వర్గానికి చెందిన వారిని అవమానించే విధంగా స్కిట్ ఉందని వేణు ని చితకబాదారు.  ఈ కార్యక్రంలో మంచి పాపులారిటీ సంపాదించిన చమ్మక్ చంద్రపై స్వాతినాయుడు అనే నటి చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే లేపాయి.  తనను గెస్ట్ హౌజ్ కి పిలిచి వాడుకున్నాడని కనీసం డబ్బు కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. తర్వాత ఈ విషయంలో పెద్దలు జోక్యం చేసుకొని సమస్యని పెద్దది కాకుండా చేశారు.  మరోసారి లాయర్లను కించపరిచారని కోర్టులో కేసు వేశారు.  ఇలా ప్రతిసారి ఏదో వివాదాలు జబర్ధస్త్ ని చుట్టుముడుతూనే ఉన్నాయి.

తాజాగా తాజాగా 31 మార్చి 2017 లో ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్ ప్రోమో ను  విడుదల చేసారు. ఇందులో మొదటగా సుడిగాలి సుధీర్ కి చెందిన స్కిట్ వచ్చింది. ఇందులో   సుదీర్, రాం ప్రసాద్ తో ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చానని చెప్తాడు...అప్పుడే గెటప్ శీను ఎంటర్ అయి ఎవడ్రా నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చింది అని అడుగుతాడు...దాంతో సుదీర్ వెంటనే స్పందిస్తూ నీ కూతురికి ఎవరిచ్చారు...మీ ఆవిడకిచ్చాను అంటూ సమాధానం చెప్తాడు...అయితే స్కిట్ పూర్తయిన తర్వాత యాంకర్ రష్మీ అక్కడకు వచ్చి ఇదేం స్కిట్ అని ప్రశ్నించింది.

దీంతో గెటప్ శీను నువ్వు ఎక్కువ చేయకు అని అనడంతో..వెంటనే నాగబాబు రోజాలు కూడా సుదీర్ టీం పై ఒక్కసారే కోపం తెచ్చుకున్నారు. ఈ మద్య మీకు కాస్త పొగరు, అహంకారం, ఈగో  ఎక్కువైందని అనడంతో వెంటనే గెటప్ శీను నాగబాబు, రోజాలనుద్దేసించి మీరు స్కిట్ చేయండి అని పొగరుగా సమాధానం ఇచ్చాడు. దీంతో దీన్ని ఇష్యూ చేయాలనుకుంటున్నారా..అసలు ఏంటీ మీ ఉద్దేశ్యం అంటూ..అవుట్ ఆఫ్ మై సైట్ అని వార్నింగ్ ఇవ్వడంతో గొడవ పూర్తయింది...అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కు ఆదరణ తగ్గుతుండడం , వివాదాలకు లోనవుతుండడం తో వ్యూస్ కోసం కావాలనే ఈ వివాదం సృష్టించారని కొంత మంది అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: