పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. కిశోర్ పార్ధసాని డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ వీరం రీమేక్ గా వచ్చింది. అయితే ఈ సినిమా రిజల్ట్ మాత్రం ముందు కనిపెట్టేశాడట సురేష్ బాబు. అందుకే సురేష్ బాబు వెంకటేష్ నటించిన గురు సినిమాను మార్చ్ 31కి ప్రీ పోన్ చేశాడు.


సాలా ఖదూస్ రీమేక్ తో వస్తున్న ఈ గురు సినిమా సుధ కొంగర డైరక్షన్ లో వస్తుంది. కాటమరాయుడు 24 రిలీజ్ అయినా సరే సినిమా ఫలితం ముందే ఊహించి ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ముందుకు తెచ్చారు. మార్చ్ 31న గురుగా వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 


సినిమా ఫలితాలను ముందే కనిపెట్టేయడంలో సురేష్ బాబు చాలా స్పెషల్. ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో ముందే చెప్పేయగలడు. అందుకే సురేష్ బాబు నిర్ణయాన్ని గౌరవిస్తారు. కాటమరాయుడు చేస్తున్న హడావిడి చూసి సినిమా రిలీజ్ తర్వాత అంత సీన్ ఉండదని ముందే కనిపెట్టి గురు సినిమాను మార్చ్ 31న రిలీజ్ ఎనౌన్స్ చేశాడు.


వెంకటేష్ తో పాటు రితిక సింగ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెషన్ కొట్టేసింది. వెంకటేష్ కొత్తగా కనిపిస్తున్న ఈ సినిమా రిజల్ట్ మీద గట్టి నమ్మకం మీద ఉన్నారు చిత్రయూనిట్. వెంకటేష్ కెరియర్ లో ఈ మూవీ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. బాబు బంగారం తర్వాత వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: