పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు. కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా ఓ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న పవన్ ఫ్యాన్స్ స్టూడియో లైవ్ లోనే రచ్చ రచ్చ చేశారు. మా హీరో సినిమా కు ఇంత తక్కువ రేటింగ్ ఇస్తావా అంటూ మండిపడ్డారు. ఏకంగా లైవ్ లోనే యాంకర్ పై దాడి చేశారు.
యాంకర్ టేబుల్ పై ఉన్న వస్తువులను నేలకేసి బాదారు. కుర్చీలను ఎత్తేశారు.. యాంకర్ పై కలబడ్డారు. నానా హంగామా చేసేశారు.. వాస్తవానికి కాటమ రాయుడు సినిమాపై డివైడ్ టాక్ నడుస్తోంది.
యావరేజ్ చిత్రంగా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ సినిమాపై దాదాపు అన్ని వెబ్ సైట్లు 2, 2.5 రేటింగ్ కు మించి ఇవ్వలేదు.
సాధారణంగా సినిమా విడుదలైతే.. సినిమా నటీనటులను, డైరెక్టర్లను, సాంకేతిక బృందాన్ని స్టూడియోలకు పిలిచి డిస్కషన్స్ నిర్వహిస్తారు. కానీ ఈసారి మన టీవీ అనే ఛానెల్ వెరైటీగా పవన్ ఫ్యాన్స్ ను డిస్కషన్స్ కు పిలించింది.
సినిమా గురించి అన్ని విషయాలు చర్చించిన తర్వాత రేటింగ్ 3 పాయింట్లు ఇచ్చింది. అప్పటివరకూ బాగానే ఉన్న ఫ్యాన్స్ రెచ్చిపోయారు.
మా హీరో సినిమాకు అంత తక్కువ రేటింగ్ ఇస్తారా అంటూ నానా హంగామా చేశారు. సాధారణంగా 3 పాయింట్ రేటింగ్ అంటే అంత తక్కువేమీ కాదు.. కానీ.. ఫ్యాన్స్ ఆశలకు హద్దు ఉంటుందా.. అందుకే తట్టుకోలేకపోయారు. రచ్చ రచ్చ చేశారు.